English | Telugu
పాఠశాలపై కూలిన విమానం..19 మంది మృతి
Updated : Jul 21, 2025
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్లో బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలింది. దీంతో క్యాంపస్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో19 మందిమృతి చెందగా పలువురు గాయపడ్డారు. వెంటనే అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కూలిన విమానం F-7 BGI గా బంగ్లా సైన్యం పేర్కొన్నాది. విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగసిపడుతున్నాయి. రెస్క్యూ టీములు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.