English | Telugu

కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీ ఖాన్ నియామకం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం కొత్తగా వీరిని నియమించడాన్ని సవాల్ చేస్తు బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.

తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఖళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయిని సుప్రీం పేర్కొన్నాది. వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే, వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు