English | Telugu
ఎలక్ట్రీషియన్ అంటూ మాధురీ దీక్షిత్ ఇంటికి వచ్చిన ఆగంతకుడు!
Updated : Feb 17, 2022
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మాధురీ దీక్షిత్ త్వరలో 'ద ఫేమ్ గేమ్' అనే వెబ్ సిరీస్తో మనముందుకు రాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆ సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ షో ప్రమోషన్ నిమిత్తం ద కపిల్శర్మ షోలో పాల్గొన్నారు మాధురి. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్గా మారింది. ఒక వ్యక్తి ఎలక్ట్రిషియన్గా తన ఇంట్లోకి ప్రవేశించిన ఘటన గురించి ఆ ప్రోమోలో ఆమె ప్రస్తావించారు.
"ఒకసారి మా ఇంట్లో స్విచ్బోర్డ్ పనిచేయలేదు. దాన్ని బాగుచేయడానికి నలుగురు ఎలక్ట్రిషియన్లు మా ఇంటికి వచ్చారు. వారిలో ఒకతను ఏ స్విచ్బోర్డ్ పనిచేయట్లేదని అడిగాడు. నేను చూపించాను. ఒకరు ఆ స్విచ్ బాక్స్ను ఓపెన్ చేస్తే, ఇంకొకరు దాన్ని చెక్ చేశారు. పని పూర్తయ్యాక వాళ్లను వెళ్లమని చెప్పాను. అయితే వారిలో ముగ్గురు వెళ్లిపోగా, ఒకతను అక్కడే నిల్చున్నాడు. 'వాళ్లతో పాటు నువ్వు వెళ్లలేదా?' అని అడిగాను. అతను 'నేను వాళ్లతో రాలేదు. నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను' అని చెప్పాడు" అని చెప్పింది మాధురి. దాంతో షోలో ఉన్నవాళ్లంతా గట్టిగా నవ్వేశారు.
'ద ఫేమ్ గేమ్' విషయానికి వస్తే, భర్త పిల్లలతో హ్యాపీగా జీవితం గడుపుతున్న ఒక గ్లోబల్ సూపర్స్టార్ హఠాత్తుగా అదృశ్యమైపోతుంది. ఆమె అదృశ్యానికి కారణమేంటా అని ఒకవైపు పోలీసులు, మరోవైపు ఆమెను ప్రేమించేవాళ్లు అన్వేషించడం ప్రారంభిస్తారు. ఆ గ్లోబల్ స్టార్ క్యారెక్టర్ను మాధురి పోషించగా, సంజయ్ కపూర్, మానవ్ కౌల్, లక్షవీర్ శరన్, సుహాసిని మూలే, ముస్కాన్ జఫేరి ఇతర కీలక పాత్రలు చేశారు.