English | Telugu
జపాన్ లో సల్మాన్ ఖాన్.. అభిమానులకి ఊరట
Updated : May 3, 2024
సల్లు భాయ్ సల్మాన్ ఖాన్ కి ఇండియన్ సినీ ప్రేమికులకి ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. మూడు దశాబ్దాలపై నుంచి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని సంపాదించాడు. తాజాగా ఆయనకీ సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సల్మాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సృష్టిస్తుంది. అలాంటి ఒక మూవీ నే టైగర్ 3 . గత సంవత్సరం నవంబర్ లో వచ్చి 560 కోట్ల రూపాయిల దాకా వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ జపాన్ లో విడుదల అయ్యింది. మే 3 న అత్యధిక థియేటర్స్ లో జపాన్ భాష సబ్ టైటిల్స్ తోనే జపనీయుల ముందుకు వచ్చింది.అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా మేకర్స్ విడుదల చేసారు.
టైగర్ 3 లో సల్మాన్ తో కత్రినా కైఫ్ జత కట్టింది. ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఇమ్రాన్ హష్మి పవర్ ఫుల్ విలన్ రోల్ లో మెరిశాడు .మనీష్ శర్మ దర్శకత్వం వహించగా ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఇంటి బయట కొంత మంది దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా ఆయన అభిమానులతో పాటు అందరు షాక్ కి గురయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన జపాన్ టైగర్ న్యూస్ వాళ్లలో కొంచం ఉరటని కలిగిస్తుంది