English | Telugu
రష్మికకి చెక్ పెట్టిన షనయా కపూర్.. అరే ఏమైంది?
Updated : Jan 3, 2023
మబ్బులు చూసి ముంత ఒలకబోసుకోకూడదు అని అంటారు పెద్దలు. అంటే అన్నారు కానీ, ఆ మాటను రష్మిక విన్నట్టు లేదు. ఒకవేళ విని ఉంటే, నార్త్ అవకాశాలను చూసుకుని మన దగ్గర ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఉండేది కాదేమో. ఇప్పుడు చూడండీ ఏమైందో..?
టైగర్ ష్రాఫ్ పక్కన 'స్క్రూ ఢీలా' సినిమాలో హీరోయిన్గా రష్మిక ఎంపికైందని ముంబై మొత్తం కోడైకూసింది. కానీ పే కట్, బడ్జెట్ పరంగా ఉన్న రష్మిక వాళ్లకు భారంగా అనిపిస్తుందట. అందుకే ఆమె ప్లేస్లో షనయా కపూర్ని సెలక్ట్ చేసుకున్నారట. షనయా ఇంకా సైన్ చేయకపోయినా డీల్ ఆల్రెడీ ఓకే అయిపోయినట్టేనట. "వస్తున్న వార్తలు నిజమే. టైగర్ పక్కన రష్మిక ప్లేస్లో షనయాని తీసుకున్నారు. ఇంకా షనయా డాటెడ్ లైన్స్ లో సంతకం చేయలేదు. అయినా ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయినట్టే. సినిమాను అఫిషియల్గా అనౌన్స్ చేసేటప్పుడు షనయా పేరే ఉంటుంది" అని అంటోంది బాలీవుడ్ మీడియా.
యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కోసం ముందు షనయానే అనుకున్నారు. అయితే ఆమె శశాంక్ ఖైతాన్ ప్రాజెక్ట్ కి ఓకే చేయడం వల్ల, ఈ ప్రాజెక్టుకు కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేకపోయింది. కానీ, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో ఇప్పుడు మళ్లీ టైగర్కి యస్ చెప్పిందట. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా ముంబైలో పేరు తెచ్చుకుంటోంది షనయా. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ 'బడేమియా చోటేమియా' పనుల్లో బిజీగా ఉన్నారు. 'స్క్రూ ఢీలా' ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకుని 2022లో విడుదల కావాల్సింది. కానీ టైగర్ మిగిలిన ప్రాజెక్టుల డిలే భారం ఈ ప్రాజెక్టు మీద పడటంతో అనుకున్నట్టు జరగలేదు.
మరి ఇంతకీ టైగర్ ప్రాజెక్ట్ గురించి రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలని అనుకుంటున్నారు ముంబై మేకర్స్.