Read more!

English | Telugu

తమ అభిమాన హీరో సినిమా చూడటం కోసం విదేశాలనుంచి ఇండియాకి వస్తున్న ఫ్యాన్స్ 

షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ ల క్రేజీ కాంబోలో వస్తున్న డంకీ  సినిమాపై భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు ఈ  మూవీ షారుక్ అండ్ రాజ్ కుమార్ హిరానీ ల కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి మూవీ. డిసెంబర్ నెలలో వస్తున్న అతి పెద్ద మూవీస్ లో ఒకటిగా నిలిచిన డంకీ  కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సంచలనం సృష్టిస్తుంది.

డిసెంబర్ 21 న రిలీజ్ కాబోతున్న డంకీ  మూవీ చూడటానికి ఇతర దేశాల్లో ఉన్న వందలాది మంది షారుక్ ఫ్యాన్స్ ఇండియా రావడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే విడుదల అయిన మూవీ టీజర్ అండ్ త్రీ సాంగ్స్ తో విదేశాల్లో ఉన్న వారికి భారతదేశ మట్టి గుర్తుకు రావటంతో వాళ్లంతా ఇండియా వస్తున్నారు. తాము పుట్టిన జన్మ భూమిలో తమ వారితో కలిసి డంకీ  మూవీ చూసి  కొన్ని రోజులు వాళ్ళతో  గడపాలనే కోరికతో  వస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రియమైన వారికోసం ఎంతదూరమైనా వెళ్లాలనేది డంకీ  మూవీ కథ యొక్క మెయిన్ పాయింట్ కావడంతో  తమ అభిమాన హీరో మూవీ లో చేసినట్టుగా ఎక్కడెక్కడో ఉన్న షారుక్ ఫాన్స్  డంకీ  చూడటానికి  వస్తున్నారు.

 


   

పఠాన్ ,జవాన్ ల సినిమాలతో మంచి జోరు మీద ఉన్న షారుక్ ఇప్పుడు  డంకీ  తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం గ్యారంటీ అని షారుక్ అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. పైగా  రాజ్ కుమార్ హిరానీ లాంటి  దర్శక దిగ్గజం ఈ మూవీ తెరకెక్కిస్తుండటంతో డంకీ  సరికొత్త రికార్డులు సృష్టించడం కూడా  ఖాయమని షారుఖ్ ఫ్యాన్స్ అంటున్నారు. స్నేహం ప్రేమ వంటి అంశాలతో  తెరకెక్కిన డంకీ  క్రిస్టమస్ కానుకగా ఈ నెల 21 న విడుదల కాబోతుంది. షారుఖ్ తో తాప్సి పన్ను జత కడుతున్న ఈ మూవీలో బొమన్ ఇరానీ ,విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్ ,అనిల్ గ్రోవర్ ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైనేమెంట్స్ , రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్ సమర్పణలో గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ లు డంకీ  కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.