Read more!

English | Telugu

సినిమాల్లోకి రాక‌ముందే చాలా మందితో డేటింగ్ చేశా!

 

బాలీవుడ్ హీరోయిన్లు వార్తల్లో ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు, ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అలరిస్తుంటారు. ఈ లిస్టులో బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేక‌ర్ కూడా ఉంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన 'దమ్ లగాకే హైస్సా' సినిమాతో బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన భూమి, ఆ వెంట‌నే అక్ష‌య్ కుమార్ లాంటి టాప్ స్టార్ జోడీగా న‌టించిన 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ క‌థా' మూవీతో పాపుల‌ర్ అయ్యింది.

ఆయుష్మాన్‌తోనే న‌టించిన 'శుభ్ మంగ‌ళ్ సావ‌ధాన్' మూవీతో పాటు, ఆంథాల‌జీ ఫిల్మ్ 'ల‌స్ట్ స్టోరీస్‌'లో చేసిన సుధా మ‌హేశ్వ‌రి పాత్ర‌తో మ‌రింత పేరు తెచ్చుకుంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భూమి. తాను మోడ్రన్ గాళ్‌న‌నీ, బాలీవుడ్ కి పరిచయం కాకముందు చాలా మందితో డేటింగ్ చేశానని తెలిపి షాకిచ్చింది.

తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నాన‌ని, తోటి హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వస్తున్న వార్తలన్నీ అబద్ధమని కొట్టిపడేసింది. ప్రస్తుతానికి తను తన వృత్తినే పెళ్లి చేసుకున్నానన్న భూమి, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ఇటీవ‌ల అక్ష‌య్ కుమార్‌తో చేసిన‌ రెండో సినిమా 'ర‌క్షా బంధ‌న్‌'లో క‌నిపించిన ఆమె, 'గోవిందా నామ్ మేరా', 'భీడ్', 'భ‌క్ష‌క్' సినిమాల విడుద‌ల కోసం ఎదురుచూస్తోంది.