Read more!

English | Telugu

నా భార్య, హీరో కలిసి సినిమాని ఎవరు చూడరని చెప్పారు..దర్శకుడు వెల్లడి

 

ఒక సినిమా హిట్ టాక్ ని తెచ్చుకొని ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడానికి  కావాల్సింది ప్రేక్షకుల మద్దతు. ఈ సూత్రం సినిమా అనేది పురుడు పోసుకున్న టైం నుంచి వస్తూనే ఉంది.అలాగే  చిన్న సినిమానా, పెద్ద సినిమానా, సినిమాలో ఆర్టిస్టులు పెద్ద వాళ్ళా, చిన్న వాళ్ళా అనేది కూడా ప్రేక్షకులకి  నథింగ్. సినిమాలో విషయం ఉందా లేదా అనేదే వాళ్ళకి  అవసరం. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులు ఒక చిన్న చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసారు. ఆ సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఆ చిత్ర దర్శకుడు చెప్పిన విషయాలు ఇప్పుడు  వైరల్ గా మారాయి

 
విక్రాంత్ మాస్సే అండ్  మేధా శంకర్ లు కాంబోలో  గత అక్టోబర్ 27 న  బాలీవుడ్ లో విడుదలైన మూవీ 12th ఫెయిల్. సుమారు 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ  ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ చిత్రం 100 రోజులని పూర్తి చేసుకున్న సందర్భంగా సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఫంక్షన్ లో 12th ఫెయిల్ చిత్ర దర్శక, నిర్మాత  విధు వినోద్ చోప్రా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.  12th ఫెయిల్‌ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని విడుదలకి సిద్ధం అవుతున్నప్పుడు  విధు వినోద్ చోప్రా భార్య  అనుపమ చోప్రా అండ్ మరికొంత మంది సన్నిహితులు 12th ఫెయిల్ ని  థియేటర్స్ లో  చూడటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరని అందువల్ల  ఓటిటి లో విడుదల చేయమని చోప్రా కి చెప్పారు.

 పైగా హీరో క్యారక్టర్  విక్రాంత్ కూడా చోప్రాతో మన సినిమా చూడటానికి  థియేటర్లకు ఎవరు  రారని చెప్పాడు.కానీ చోప్రా మాత్రం సినిమా మీద నమ్మకంతో థియేటర్స్ లో రిలీజ్ చేసి సినిమాకి ఉన్న శక్తిని చాటి చెప్పాడు. ఈ విషయాల గురించే చోప్రా చెప్పాడు. అలాగే  సినీ వ్యాపార వర్గాలు కూడా  12th ఫెయిల్  30 లక్షలు దాకా మాత్రమే  వసూలు చేస్తుందని చెప్పారని కానీ మా సినిమా 70 కోట్లు దాకా వసూలు చేసిందని కూడా అయన  చెప్పాడు .అనుపమ చోప్రా కూడా తన నిర్ణయం తప్పని అంతిమంగా సినిమానే గెలిచిందని చెప్పింది. ప్రముఖ ఐపిఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ మరియు ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషి నిజ జీవిత కథల ఆధారంగా  12th ఫెయిల్ చిత్రం రూపొందించబడింది.