సీఎం భార్యకు నోటీసులు
మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా భార్య డికాంచీ డి షిరాకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆయా సభల్లో పాల్గొన్న ఆమె బీజేపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయ్యింది. మీడియా నుంచి నేరుగా సుమోటోగా స్వీకరించిన ఎన్నికల సంఘం, బీజేపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన డికాంచీ, స్థానిక భాష మీడియాకు అర్ధంకాకపోవడంతో తప్పుగా రాసిందని, అటువంటి వ్యాఖ్యలు తాను చేయలేదన్నారు.