రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం న్యూఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. ఆ క్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి కానీ, ప్లోర్ లీడర్ కానీ, జాతీయ అధికార ప్రతినిధి పదవి కానీ ఇవ్వలని కమలం పార్టీ అధిష్టాన్ని కోరారు. పార్టీ కోసం 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నానని.. తానేందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని ఆయన ప్రశ్నించారు. అయితే కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని అభిప్రాయపడ్డారు.  అయితే రెండోసారి కూడా దుబ్బాక నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చి ప్రచారం చేయలేదని.. అలాగే తనకు ఎవరు సాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు.   అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో 100 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినా.. బీజేపీ గెలవలేదని.. సొంతంగానే తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా రఘునందన్ రావు గుర్తు చేశారు. అదే 100 కోట్ల రూపాయిలు తనకు ఇస్తే.. తెలంగాణ దున్నేసేవాడినన్నారు. దుబ్బాకలో తనను చూసి గెలిపించారని.. అంతేకాని బీజేపీ చూసి కాదన్నారు. తాను బీజేపీ అభ్యర్థిగా ఈ నియోజకర్గం నుంచి గెలవక ముందు.. జరిగిన ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే కేవలం 3,500 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధమని, పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ  చేసిన సంజయ్‌కు వందకోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని రఘునందన్ రావు  ప్రశ్నించారు. పార్టీ డబ్బులో తనకు వాటా ఉందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బండి సంజయ్ మార్పుపై మీడియా ప్రశ్నించగా.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలేనన్నారు. పది ఏళ్లలో పార్టీ కోసం తనకంటే ఎవరు ఎక్కువ కష్టపడలేదని ఆయన పేర్కొన్నారు.  అయితే పేపర్ ప్రకటనల్లో తరుణ్ చూగ్, సునీల్ బాన్సల్‌ బొమ్మలు కాదు.. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ బొమ్మలుంటే ఓట్లు వేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీకి శాసనసభపక్ష నేత లేడనే విషయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సైతం తెలియదని.. ఆ విషయమై ఆయన్ని ప్రశ్నిస్తే అదేంటి అంటూ నడ్డా తనని అడిగారన్నారు. తాను గెలిచినందుకే ఈటెల బీజేపీలోకి వచ్చారన్నారు.

నాలుగు రోజుల్లో మలి విడత వారాహియాత్ర షెడ్యూల్

 ఏపీ  రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా   మూడు పార్టీల మ‌ధ్య హోరా హోరీ పోరు జ‌రుగుతోంది. వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీ ఉండ‌గా జ‌న‌సేన కూడా  ప్ర‌తిప‌క్ష పాత్ర‌ని పోషిస్తుంది. వారాహియాత్ర‌లో భాగంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న   జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్   స‌భల‌కు    జ‌నం అంచ‌నాల‌కి మించి రావడం  వైసీపీకి మింగుడుప‌డ‌టం లేదు. దీంతో వైసీపీ టిడీపీని ప‌క్క‌న‌పెట్టి జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తోంది. జ‌గ‌న్ వ్య‌క్తిగ‌తంగా చేస్తోన్న విమ‌ర్శ‌ల‌కి ధీటుగా జ‌న‌సేన స్పందిస్తోంది. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎవ‌రికీ సుర‌క్షితం కాదంటు జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ‌వ్య‌వ‌హారాల చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తాజాగా విడుద‌ల చేసిన మూడు పేజీల బ‌హిరంగ‌లేఖ‌లో నిప్పులు చెరిగారు. స‌మ‌స్య‌ల‌ని జ‌గ‌న్న‌న‌కి చెబుదామ‌నుకున్నా వినేవారు క‌నిపించ‌డం లేద‌ని పాల‌కుల్లో స్పందించే గుణం లేన‌ప్పుడు ఏ కార్య‌క్ర‌మం ప్ర‌వేశ‌పెట్టినా ఫ‌లితం ఉండ‌బోద‌ని నాదెండ్ల ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏ వ‌ర్గం సుర‌క్షితంగా లేద‌ని అర్హ‌త ఉన్న ల‌బ్దిదారుల‌కి ప‌ధకాలు అంద‌క‌పోవ‌డం దాన్ని ప్ర‌భుత్వ‌మే అంగీక‌రించ‌డం సిగ్గుచేట‌ని మ‌నోహ‌ర్ దుయ్య‌బ‌ట్టారు. వారాహి యాత్ర‌కి ప్ర‌జ‌ల ఆశీర్వాదం దొరుకుతుంటే వైసీపీ నేత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని తిరిగి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కి దిగుతున్నార‌ని మ‌నోహ‌ర్ ఈ లేఖ‌లో ఆరోపించారు.  ప‌వ‌న్ క‌ల్యాణ్ లేవ‌నెత్తిన అంశాల గురించి ఆయా శాఖ‌ల మంత్రులు వివ‌ర‌ణ ఇవ్వలేక‌పోవ‌డం ప్ర‌భుత్వ ప‌నితీరుకు అద్దంప‌డుతుంద‌ని లేఖ‌లో ఆరోపించారు. కాగా  నాలుగు రోజుల్లో మ‌లివిడ‌త వారాహి యాత్ర షెడ్యూల్ ని ప్ర‌క‌టిస్తామ‌న్న మ‌నోహ‌ర్ వారాహి విజ‌య యాత్ర మొద‌టి ద‌శ అద్భుతంగా నిర్వ‌హించామ‌న్నారు.   మ‌త్య్స‌కారుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అధ్య‌య‌నం చేశార‌ని జ‌న‌వాణి కార్య‌క్ర‌మంలో ఎక్కువ‌గా  ఫించ‌న్లు.. ర‌హ‌దారుల స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని  రాబోయే రోజుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్ని జిల్లాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించి ప్ర‌తి ఒక్క‌రికీ భ‌రోసా ఇస్తార‌ని   నాదెండ్ల మ‌నోహ‌ర్ చెబుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం   అంధ‌కారంలోకి నెట్టేసిన రాష్ట్రాన్ని ..  రాష్ట్రంలో జ‌న‌సేన‌  తిరిగి వెలుగులు నింపి  రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌చ్చే విధంగా కృషి చేయ‌నుంద‌ని  మ‌నోహర్ ఈ లేఖ‌లో ప్ర‌క‌టించారు.   వారాహి విజ‌య యాత్ర రెండో విడ‌త ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనే ప్రారంభించ‌నున్న‌ట్లు స్థానిక నాయ‌ కుల‌తో సంప్ర‌దించి నాలుగైదు రోజుల‌లోపే త‌దుప‌రి షెడ్యూల్ ప్ర‌క‌టిస్తామ‌ని జ‌న‌సేన ఈ లేఖ‌లో పేర్కొంది. వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం ప్ర‌జ‌లంతా క‌లిసి   ముందుకు చ‌క్క‌టి వేదిక ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ అడుగు వేసినా రాష్ట్ర భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకునే వేస్తార‌ని మ‌నోహ‌ర్ ఈ లేఖ‌లో వివ‌రించారు.

బీజేపీకి బొమ్మా బొరుసూ ఈటల, రఘునందనరావేనా?

బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తెలంగాణ లో బీజేపీ గాలి తీసేశారు. రాష్ట్రంలో బీజేపీ అంటే తానూ ఈటలేననీ, కమలం గుర్తు చివరన వస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు తరుణ్ భుజ్ ను చూసి కాదనీ, తమను చూసి పడతాయనీ అన్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాలు అధిష్ఠానానికి ఏమీ తెలియదని కుండ బద్దలు కొట్టారు. హస్తినలో ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షానికి నాయకుడు లేడన్న విషయం కూడా తెలియని స్థితిలో మా పార్టీ జాతీయాధ్యక్షుడు ఉన్నారని రఘునందనరావు అన్నారు.  తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుందనీ, ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనలో ఉన్న బీజేపీ హై కమాండ్ కు దెబ్బ మీద దెబ్బగా రఘునందనరావు వ్యాఖ్యలు ఉన్నాయి. బండి సంజయ్ ను రాష్ట్ర బీజేపీ చీఫ్ గా మార్చేస్తారన్న ప్రచారం వాస్తవమేనని ఆయన బాహాటంగా చెప్పేశారు. అంతే కాకుండా బండి సంజయ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భార్య పుస్తెలమ్మి ఎన్నికలలో పోటీ చేసిన బండి సంజయ్ కు కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేసే సొమ్ము ఎక్కడిదన్న రఘునందనరావు.. ఒక వేళ అది పార్టీ సొమ్మయితే అందులో తనకూ వాటా ఉందని అన్నారు.   మొత్తం మీద తెలంగాణ బీజేపీకి  తానూ, ఈటల బొమ్మాబొరుసు వంటి వారమని చెప్పిన రఘునందనరావు.. ఇన్నేళ్లలో పార్టీ కోసం తన కంటే ఎక్కువగా కష్టపడిన వారెవరూ లేరని చెప్పుకొచ్చారు. మొత్తం మీద తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలను ఆయన హస్తిన వేదికగా బహిర్గతం చేసేశారు. బండి మార్పుపై వస్తున్నవి ఊహాగానాలు కాదని కుండ బద్దలు కొట్టేశారు. కేంద్ర కేబినెట్ జరుగుతున్న వేళ రఘునందనరావు చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో బీజేపీలో ప్రకంపనలు రేపుతాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న ప్రచారానికీ బలం చేకూర్చాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి తన కంటే అర్హుడెవరున్నారని ఆయన అన్యాపదేశంగానైనా గట్టిగా చెప్పారు. తన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని బలగా చాటారు. ఇంత కాలం ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకుని వాపునే బలంగా చెప్పుకున్న బీజేపీకి తెలంగాణలో ఉన్న వాస్తవ బలం ఏమిటన్నది ఇప్పుడు బహిర్గతమైపోయింది. అధికారం ఖాయమంటూ ఇంత కాలం చేసుకున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు గడ్కరీయే అవాస్తవమంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేశారు. తెలంగాణలో తమ స్థాయి విపక్షానికే పరిమితమని విస్ఫష్టంగా తేల్చేశారు. అయితే గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా దూరంగానే ఉంటుందన్నది తేటతెల్లమైపోయినట్లేనని రఘునందనరావు వ్యాఖ్యలతో అర్ధమైపోయింది. 

ఉపాధి కూలీలకు భారీ మొత్తంలో బకాయిలు..! ఎందుకలా ?

 జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులకు హాజరయ్యే కూలీలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. వారికి ఇచ్చే వేసవి భత్యం తొలగించడంతోపాటు పని ప్రదేశాల్లో కూలీలకు ఇచ్చే మజ్జిగ, తాగునీటి సరఫరాను పక్కన పెట్టారు. తీవ్రమైన ఎండ ల్లోనూ రెండు నెలలుగా పనులు చేయించారు. హాజరవ్వకపోతే జాబ్ కార్డులు రద్దవుతాయని బెది రించి మరీ పనులు చేయించుకున్నారు. తీవ్రమైన వడగాలులు వీచేటప్పుడూ పనిచేసిన కూలీలకు అయిదు వారాలుగా వేతనాలు చెల్లించకుండా బకాయి పెట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్లకు పైగా చెల్లిం చాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నరే గాలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పనిదినాలను ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మూడు నెలల్లోనే వినియోగించారు. కూలీలు చేసిన పనుల వివరాలను వారానికోసారి నరేగా ఎన్ఎస్ఐసీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఒక వారం తర్వాత వాటికి చెల్లింపులు చేయాలి. ప్రస్తుతం రెండు వారాలైనా కూలీల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. నిరుపేదలకు ఉపాధి పనులే జీవనా ధారం. ఇలాంటి వారంతా వేతనాలు జాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వేతనాల చెల్లిం పుల్లో కేంద్రప్రభుత్వ పరంగా జాప్యమైనప్పుడు కూలీల అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసి కూలీలకు అందించేది. ఇప్పుడు అలాంటి ఊసే లేదు. తీవ్రమైన ఎండల్లో పనిచేసిన తమకు మజ్జిగ, తాగునీరు కూడా ఇవ్వని దారుణమైన పరిస్థితిని కూలీలు ఎదుర్కొన్నారు. అయితే.. ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు త్వరలోనే పెండింగ్ వేతనాలు జమ అవుతాయని  గ్రామీణా భివృద్ధి శాఖ అంటుంది.

రాను రానంటూనే షర్మిల..?

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు.  నాలుగేళ్ల పాటు వైఎస్సార్ సీపీ కోసం, అన్న జగన్ వదిలిన బాణంగా ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఒక విధంగా అప్పట్లో జగన్ అరెస్టయిన సమయంలో పార్టీ పతనం కాకుండా షర్మిల నిలబెట్టారనే చెప్పాలి. అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలను ఆయన కూరలో కరివేపాకులా తీసేశారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా దూరం పెట్టారు. దీంతో షర్మిల ఏపీని వదిలి..  తెలంగాణలో తండ్రిపేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి రాజకీయంగా బిజీ అవ్వడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక విధంగా చెప్పాలంటే.. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ల కంటే తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.  అయితే ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఎదురౌతున్న ప్రశ్న ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాలలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అన్నదే.  జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో  జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే, ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. ఆమే జగనన్నను వదిలేశారో తెలియదు, కానీ, పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు.అప్పటి నుంచి ఆమె తెలంగాణ రాజకీయాల్లో,ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరకంగా ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు.పాదయాత్రలు చేస్తున్నారు.  అయితే, ఇప్పుడు షర్మిల త్వరలోనే, వైఎస్సారు టీపీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారనే  ప్రచారం జోరుగా సాగుతోంది.   ఆమె ఖండించినా ఆ ప్రచారం ఆగడం లేదు.  అసలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారం కర్నాటకలో కాంగ్రెస్ ఘన విజయం తరువాత నుంచే ప్రారంభమైంది. అందుకు ఆమె ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను స్వల్ప వ్యవధిలో మూడు సార్లు కలవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ వైపు అన్న ప్రచారం జోరందుకుంది.  కాంగ్రెస్ కు కూడా వైఎస్సార్ బ్రాండ్ రూపంలో షర్మిలను చేర్చుకునేందుకు, ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే పార్టీకి ఆమె సేవలు తెలంగాణలో అవసరం లేదన్న విషయంలో కాంగ్రెస్ స్పష్టంగా  ఉంది. ఇక్కడే షర్మిల పార్టీ విలీనం విషయంలో జాప్యం జరుగుతోంది. ఆమె ఏ కారణం చేత ఏపీ వదిలి వచ్చేసినా.. ఇప్పటికీ ఆమె ఏపీలో అన్న జగన్ కు ఎదురు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అందుకే తాను కాంగ్రెస్ గూటికి చేరతాను కానీ, తన కార్యక్షేత్రం మాత్రం తెలంగాణే కావాలని అంటున్నారు. ఈ విషయంలో ఆమె ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లైన జానా రెడ్డి వంటి వారిని కలిసి చర్చించారు. అయితే టీపీసీసీ చీఫ్ మాత్రం ఆమె తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలు పెట్టడానికి కూడా అంగీకరించేది లేదంటున్నారు. అదే సమయంలో బట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రం బయటి పార్టీలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన వారు ఇప్పుడు పార్టీలో ఉండగా లేనిది షర్మిల వస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా  కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం వైఎస్ బ్రాండ్ తెలంగాణలో పార్టీకి పెద్దగా ప్రయోజనకరం కాదనీ, షర్మిల సేవలు ఏపీలో అయితే అక్కడ పార్టీ బలోపేతమయ్యే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఆత్మగా అందరూ పేర్కొనే  కేవీపీ రామచంద్రరావు షర్మిల కాంగ్రెస్ లో చేరికపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ గూటికి చేరితే షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం ఖాయమని చెబుతున్నారు. అంతా సరే కానీ షర్మిల ఏపీలో కాంగ్రెస్ ప్రచార సారథిగా కీలక బాధ్యతలు చేపట్టాలన్న కాంగ్రెస్ కండీషన్ కు ఆమె అంగీకరిస్తారా? తెలంగాణను వీడనంటూ షర్మిల కండీషన్ ను కాంగ్రెస్ హై కమాండ్ అంగీకరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. 

స్పీడ్ న్యూస్- 3

21.ఒకానొకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన వెస్టిండీస్... ఈ సారి వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోవడం క్రికెట్ ప్రేమికులకు మింగుడుపడటం లేదు. ప్రపంచ మేటి జట్లలో ఒకటైన విండీస్ లేకపోతే వరల్డ్ కప్ లో మజా ఏముంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  22.ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అధిష్ఠానం పిలుపుతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రఘునందన్ రావు.. పలువురు కీలక నేతలను కలుసుకుంటున్నారు.  23. గౌతమి గోదావరి నదిలో యానాం దగ్గర భారీ పండుగప్ప చేప ఒకటి మత్స్యకారుల వలకు చిక్కింది. సుమారు 15 కేజీల బరువున్న ఈ పండుగప్ప చేపను స్థానిక మార్కెట్ లో వేలం వేయగా రూ.9 వేల ధర పలకింది. 24.ఓ జాతీయ నాయకుడిగా పరిణతితో మాట్లాడాలని, మాటలు జారొద్దని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ నేతపై తమకు గౌరవం ఉందని చెప్పారు. అయితే, ఆ పార్టీ రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం కాకుండా నిజాలు మాట్లాడాలని రాహుల్ గాంధీకి సూచించారు.  25. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలు మొదలు కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐదు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. 26.భారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 27. యాషెస్ రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో రనౌట్ పెద్ద దుమారమే రేపుతోంది. తొలి టెస్టులోనూ ఓ క్యాచ్ వివాదాస్పదమైంది. 28.కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. 29. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా కృష్ణారెడ్డి తరపు న్యాయవాదిపై జస్టిస్ కృష్ణ మురారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 30.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది.  ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ గాడిన పడదా? కుమ్ములాటలకు ఎండ్ లేదా?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేసిన పార్టీ అందులో ఇసుమంతైనా సందేహం లేదు. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఉద్యమ సారథిగా కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ క్రెడిట్ ను తమ ఖాతాలో  వేసుకున్నారు. సోనియా గాంధీ రాజకీయ సంకల్పం వల్లే తెలంగాణ సాకారమైందని చెప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఫలితం రాష్ట్రం ఇచ్చి కూడా తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరమైంది. దూరం కావడమే కాదు.. రాష్ట్రంలో పార్టీ ఉనికి కూడా నామమాత్రమైంది.  కాంగ్రెస్ టికెట్ పై అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలలో పలువురు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని గులాబి కండువా కప్పుకున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానం  తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి పార్టీ  తెలంగాణ పగ్గాలు అప్పగించింది. ఎవరు ఔనన్నా కాదన్నా.. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జనబాహుల్యంలో కూడా కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగింది. కానీ పార్టీ బలోపేతం కావడం కంటే.. తమ సీనియారిటీని కాదని బయట నుంచి వచ్చి చేరిన రేవంత్ కు పగ్గాలు అప్పగించడాన్ని పార్టీలోని కొందరు పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ వంటి నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే.. రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరారు. సరే అదంతా పక్కన పెడితే అధిష్టానం జోక్యం వల్లనైతేనేమి, కర్నాటక ఫలితాల ప్రభావంతోనైతేనేమి? తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ కాకపోయినా కామా పడిందన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ముఖ్యంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ జన గర్జన సభ సక్సెస్ కోసం విభేదాలు విస్మరించి నాయకులంతా సమష్టిగా కృషి చేశారు. కేసీఆర్ సర్కార్ ఖమ్మంలో రాహుల్ సభను అడ్డుకోవడానికి, ఆ సభకు జనం రాకుండా అవరోధాలు కల్పించడానికీ చేయగలిగినంతా చేసింది.  ఎంత చేసినా సభ విజయవంతమైంది. జనం తండోపతండాలుగా రాహుల్ సభకు హాజరయ్యారు. ఇసుక వేస్తే రాలదన్నంతగా రాహుల్ సభకు జనం పోటెత్తారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఇక తరువాయి అన్నంతగా పార్టీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమైంది. అయితే రాహుల్ సభ సక్సెస్ అయ్యిందన్న ఉత్సాహం  24 గంటలు కూడా గడవకుండానే పార్టీ శ్రేణుల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లుగా భట్టి విక్రమార్క మాట్లాడారు. రేవంత్ కు సీఎం చాన్స్ లేదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నేరుగా రేవంత్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన కాంగ్రెస్ లోనే పుట్టిన వ్యక్తికి తప్ప మరొకరికి సీఎం పదవి దక్కే చాన్స్ లేదన్నారు. అక్కడితో ఆగకుండా టీపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలుపెట్టడానికి అంగీకరించను అని రేవంత్ చెప్పిన మాటలను కూడా  ఖండించారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన వారు కాంగ్రెైస్ లో ఉన్నారనీ, షర్మిల వస్తే తప్పేముందని పరోక్షంగా రాహుల్ మాటలను ఖండించారు. దీంతో కాంగ్రెస్ లో ఐక్యత కనిపిస్తోందనీ, నేతలంతో ఏకతాటిపైకి వచ్చారనీ సంబరపడుతున్న క్యాడర్ ఉత్సాహంపై భట్టి నీళ్లు చల్లేశారు. కష్టపడి గెలిపించుకున్నా అంతర్గత కుమ్ములాటల కారణంగా ‘చే’ జేతులా అధికారాన్ని వదులుకోవడానికి రాష్ట్ర నాయకత్వం పోటీ పడుతుందని పార్టీ శ్రేణులే బాహాటంగా అంటున్నాయి. నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా అధిష్ఠానం నిరోధించగలిగితేనే.. పార్టికి రాష్ట్రంలో ఏర్పడిన సానుకూల వాతావరణం ఎన్నికల వరకూ ఉంటుందనీ, లేకుంటే ఎగిసిపడిన కెరటంలా మళ్లీ  పార్టీలో నిస్తేజం అలుముకుంటుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా సత్య కుమార్ ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆస్థానంలో మరో వ్యక్తిని నియమించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.  ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే సోము వీర్రాజు మాత్రం తానే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆయనకు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ అండదండలు ఉండడంతో, వీర్రాజు అధ్యక్ష కుర్చిని వీడకుండా ఉండేందుకు   గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏపీ బీజేపీలో వీర్రాజును వ్యతిరేకించే నాయకులు  రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో  అధిష్టానం ఆయన్ను మార్చాలనే ఆలోచనలో ఉంది.  ఆయనపై వైసీపీ ముద్ర పడడం, వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ రాష్ట్ర  బీజేపీలో గ్రూపులు పెరిగిపోవడం వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఆయనను మార్చాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన వెంటనే ఏపీ బీజేపీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బిజెపి జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ను నియమించాలని బిజెపి అధిష్టానం పెద్దలు నిర్ణయించుకున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సత్య కుమార్ కు హై కమాండ్ పెద్దల వద్ద పలుకుబడి ఉండడం, ఆయన కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని స్వీకరించాలనే ఆలోచనతో ఉండడం, ఆయనకు వీర్రాజు వ్యతిరేక వర్గం మద్దతు ఉండడం ఇవన్నీ కలిసివచ్చే అంశాలు. సోము వీర్రాజు వైసీపీ అనుకూల వ్యక్తి అనే ముద్ర పడటంతో పాటు, బీజేపీ లోని చాలామంది నాయకులతో విభేదాలు ఉండడం, అలాగే బీజేపీ  మిత్రపక్షం గా ఉన్న జనసేన ను కలుపుకు వెళ్లే విషయంలో వీర్రాజు చురుగ్గా వ్యవహరించకపోవడం, ఈ విషయంలో జనసేన వర్గాలలోనూ తీవ్రమైన అసంతృప్తి ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వీర్రాజు స్థానంలో సత్యకుమార్ ను నియమించాలని అధిష్టానం పెద్దలు దాదాపుగా డిసైడ్ అయిపోయారట. ఇక సత్యకుమార్ విషయానికి వస్తే, ఏపీ బీజేపీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఏపీలో వైసిపి ప్రభుత్వంపై సందర్భం వచ్చినప్పుడల్లా సత్య కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఏపీ బీజేపీలో గ్రూపుల గోల తగ్గుతుందనే నిర్ణయానికి బిజెపి అధిష్టానం పెద్దలు రావడంతోనే, సత్య కుమార్ వైపు వారు మొగ్గు చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వైసీపీని విమర్శలతో ముప్పు తిప్పలు పెట్టడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమైయ్యారు. జనసేనతో దూరంగా ఉండటం కూడా ఆయనకు మైనస్ పాయింట్ అయింది. ఇటీవల.. పార్టీ ని వీడి.. టీడీపీలోని మారిన  బీజేపీ మాజీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.. వీర్రాజు పై విమర్శల బాణాలు వదిలారు. వీర్రాజు వల్లే తాను బీజేపీ ని వీడానని ఆయన అనడం.. వీర్రాజుపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉండటానికి మరో కారణమైంది. అందువల్లే ఏపీ బీజేపీ అధ్యక్ష మార్పు ఆలోచన అనివార్యమైందని పరిశీలకులు భావిస్తున్నారు.

స్పీడ్ న్యూస్- 2

11. మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తంగా మారాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు.  12. ఖమ్మంలో సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా హరీశ్ స్పందిస్తూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అని మండిపడ్డారు.  13.దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఓ డ్రోన్ అనుమానాస్పదంగా ఎగరడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. డ్రోన్ ను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 14.బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై నేరుగా విమర్శలు చేస్తూ.. ఎప్పుడూ హుషారుగా మాట్లాడే  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త డీలా పడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా తనను తప్పిస్తారన్న వార్తలు, ఊహాగానాల నేపథ్యంలో నిన్న వరంగల్‌ జిల్లా హన్మకొండలో పర్యటించిన సంజయ్ ముభావంగా కనిపించారు.  15. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఈ ఉదయం సింహాద్రి గిరులు కిక్కిరిసిపోయాయి. 16.నిన్నటి ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా ప్రతిస్పందిస్తూ ధరణిని ఎత్తేస్తామన్న రాహుల్ ను తెలంగాణ సమాజం క్షమించదని వ్యాఖ్యానించారు.  17.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు. 18.వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.  19.ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై చర్చకు రావలంటూ టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. 20.ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. 17.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు. 18.వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.  19.ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై చర్చకు రావలంటూ టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. 20.ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. 17. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు. 18.వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.  19.ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై చర్చకు రావలంటూ టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. 20.ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు.

టైమ్స్ నౌ తాజా సర్వే.. ముందస్తు సార్వత్రిక ఎన్నికలపై చర్చ

తాజగా టైమ్స్ నౌ సర్వే ఒకటి వచ్చింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే దేశంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుంది అని చెప్పుకొచ్చింది. అంటే దేశంలో రాజకీయ ముఖ చిత్రం మారకుండా ఉంటే మోడీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని   ఆ సర్వే చెబుతోంది. అయితే ఈ డిసెంబర్ లో దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఏమైనా ఫలితాలు తేడా కొడితే, కర్నాటక తరహా ఫలితాలు వస్తే మోడీ ఇమేజ్ కూడా ఇబ్బందులో పడుతుంది. మూడో సారి అధికారం అన్న ధీమా ఉండదని కూడా ఆ సర్వే అంతర్లీనంగా చెప్పినట్లైంది. వాస్తవానికి టైమ్స్ నౌ మోడీ భజన పత్రికగా గుర్తింపు పొందింది. అటువంటి పత్రిక సర్వేలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే.. మోడీ హ్యాట్రిక్ ఖాయం అంటూ తేలడంతో ఇప్పుడు బీజేపీలో అంతర్మథనం మొదలైంది.న అంటే ఆయా రాష్ట్రాలఅసెంబ్లీల ఎన్నికల ఫలితాలు కచ్చితంగా సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే వాటితో పాటే లోక్ సభ ఎన్నికలు కూడా జరిపిస్తే.. అంటే మధ్యంతర ఎన్నికలకు మోడీ మొగ్గు చూపితే  బాగుంటుందన్న సూచన ప్రాయమైన సలహా కూడా ఆ సర్వే ఇచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే టైమ్స్ నౌ సర్వే కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే మోడీకి మళ్లీ అధికారం అన్నది నొక్కి చెప్పిందన్నది పరిశీలకుల  విశ్లేషణ. ఆ సర్వేను బీజేపీ సీరియస్ గా తీసుకుందని కూడా అంటున్నారు.   దీంతో ముందస్తు సార్వత్రిక ఎన్నికల చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించేసింది.  ఇప్పుడు ముందస్తు సార్వత్రిక  ఎన్నికలంటే సాధ్యమేనా అన్న అనుమానానికి విశ్లేషకులు మోడీ తలచుకుంటే జరగనిదేముంటుందని అంటున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు  జరిగే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తం చేసి సెట్ చేసేస్తారనీ, ఆ విధంగా ఆయన జమిలి ఎన్నికల లక్ష్యాన్ని ఈ సారే పాక్షికంగా అమలు చేసేసినట్లౌతుందనీ అంటున్నారు.   కేంద్రం, మోడీ అందుకు సుముఖంగా ఉంటూ సై అనడానికి ఏపీలోని జగన్ సర్కార్ రెడీగా ఉందని గుర్తు చేస్తున్నారు. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఏపీలో జగన్ సర్కార్ కు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగితేనే మేలైన ఫలితాలు వస్తాయి. సరే ఆ సర్వేపై వస్తున్న విమర్శలు, కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలను పక్కన పెడితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కూడా అధికార పార్టీకే ఒకింత సానుకూలత వ్యక్తమౌతోంది. ఈ కారణంగానే ఇటు ఏపీలోనూ, అటు కేంద్రంలోనూ కూడా ముందస్తు చర్చ గట్టిగా వినిపిస్తోంది.   ఈ నేపథ్యంలోనే  షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకే కాకుండా ఏపీ వంటి రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా   జరిగే  అవకాశాలను కొట్టిపారేయ లేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ ఈ నెల 5,6 తేదీలలో తలపెట్టిన హస్తిన యాత్రకు ముందస్తు చర్చతో ముడిపెడుతున్నారు. 

స్పీడ్ న్యూస్- 1

1.పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అభిమానులను పలకరించనున్నారు. ఇన్ స్టాగ్రాంలోకి పవన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఆయన సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. 2.50 లక్షల విలువైన వజ్రపుటుంగరాన్ని దొంగిలించిన ఓ యువతి ఆ తర్వాత పోలీసుల భయంతో దానిని టాయిలెట్ కమోడ్‌లో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిందీ ఘటన 3.ఎన్సీపీలో పెను కలకలానికి కారణమైన ఆ పార్టీ నేత అజిత్ పవార్ సహా 9 మంది రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు ఎన్సీపీ సిద్ధమైంది. వారిపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్టు పార్టీ అధినేత జయంత్ పాటిల్ తెలిపారు.  4. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఈ ఉదయం సింహాద్రి గిరులు కిక్కిరిసిపోయాయి.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 5.చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా అకస్మాత్తుగా పాకిస్థాన్‌లో పర్యటించడం తీవ్ర చర్చకు కారణమైంది. జూన్ 29న లాహోర్‌లో వాలిపోయిన జాక్ మా 23 గంటలపాటు అక్కడే ఉన్నట్టు బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ మాజీ చైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ ఎహసాన్ తెలిపారు. 6.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 7. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పందిస్తూ ఖమ్మం సభ ముగించుకుని గత రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ను కలిసేందుకు వచ్చిన  ఆయన మాట్లాడారు.  8.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో త్వరలోనే ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని వెల్లడించారు. 9.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. కొద్దిరోజులుగా కేంద్ర కేబినెట్ లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ప్రచారం జరుగుతుండడం, ఆదివారం మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 10.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 144వ రోజు నెల్లూరు రూరల్ కాకుపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ, దిష్టి తీస్తూ ఘనస్వాగతం పలికారు.

జగన్ ముందస్తు ముచ్చట..ఓ అంతులేని కథ

వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏం జరుగుతుందో ఏపీలో  హేతువుతో సంబంధం లేకుండా సాగుతున్న ఊహాగాన సభలను గమనిస్తు ఇట్టే అర్ధమైపోతుంది. ఈ ఏడాది చివరిలో దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఇక రెండు మూడు నెలలలో షెడ్యూల్ విడుదల కూడా జరిగిపోతుంది. అయినా ఏపీలో ముందస్తు ముచ్చటకు సంబంధించిన ఊహాగానాలూ, అంచనాలూ ఇసుమంతైనా ఆగడం లేదు. ఏపీ సీఎం స్వయంగా ముందస్తు ప్రశ్నే లేదు.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అని విస్పష్టంగా ప్రకటించినా.. పరిశీలకుల నుంచి, రాజకీయ విశ్లేషకుల దాకా, సామాన్య జనం నుంచి ప్రతి పక్ష పార్టీల వరకూ ఏపీలో ముందస్తు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు.  తాజాగా మరో మారు ఏపీలో ముందస్తు ఎన్నికలపై మరో సారి విస్తృత స్థాయి చర్చలకు తెరలేచింది. ఇందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ హస్తిన పర్యటనకు ముహూర్తం ఖరారు కావడమే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు బీజేపీ కీలక నేతలు, మంత్రులతో కూడా భేటీ అవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మోడీ, షాల అప్పాయింట్ మెంట్ ఖరారైందని కూడా చెబుతున్నాయి. జగన్ ఈ పర్యటన విషయంలో బయటకు చెబుతున్న కారణాలు ఏపీకి రావలసిన అంశాలపై చర్చే అని చెబుతున్నా.. వాస్తవ కారణం మాత్రం ముందస్తు కోసం మోడీకి బతిమలాడుకోవడం కోసమేనని అంటున్నారు. అంతే కాకుండా మోడీ కూడా ముందస్తు యోచన చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జగన్ పర్యటన  రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ తన అప్పుల పరిమితి దాదాపు వాడేసుకుంది. ఎడాపెడా అప్పులు, కేంద్రం నుంచి ఉదారంగా నిధులూ వచ్చినా కూడా ఆగస్టు నుంచి ఉద్యోగుల జీతాలే కాదు, బటన్ నొక్కుడు సంక్షేమానికీ ఇబ్బందులు తప్పవు. దీంతో జగన్ కేంద్రం వద్ద మీరు ఆదుకోవాలి అంటూ వేడుకోవడం, అలాగే దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకుంటాను.. ముందస్తుకు అవకాశం ఇవ్వండి అని విజ్ణప్తి చేయడం వినా మరో గత్యంతరం లేదని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్  ఈ నెల5, 6 తేదీలలో హస్తినలో పర్యటించనుండటం ప్రభుత్వ పెద్దలతోనే కాకుండా, బీజేపీ అగ్రనాయకులతో కూడా సమావేశం కానుండటంతో.. మోడీ ప్రమేయంతో ముందస్తుకు అవకాశం దక్కేలా చేసుకుంటారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 2014 ఎన్నికలలో తన పార్టీని విజయ పథంలో నడిపించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆ తరువాత చుట్టూ సమస్యలు చుట్టుముట్టడంతో వ్యూహాత్మకంగా 2019 వరకూ ఆగకుండా ఆర్నెళ్లు ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2018లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం ఆయన అంతే వ్యూహాత్మకంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెడుతున్నారు.  ఇక జగన్ విషయానికి వస్తే 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆయన నాలుగేళ్లలోనే అంతులేనంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత  రోజు రోజుకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. అలా తగ్గే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. సంక్షేమం అంటూ బటన్లు నొక్కి లబ్ధి దారుల ఖాతాలలో సొమ్ములు వేస్తున్నా.. ఎక్కడా సంతృప్తి అన్నది ప్రజలలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో బటన్ నొక్కుడు కూడా కష్టమయ్యేలా భవిష్యత్ అద్దంలో కనిపిస్తుండటంతో జగన్ లో ఆందోళన పెరుగుతోంది. దీంతో  షెడ్యూల్ వరకూ వేచి చూడాలని ఆయన భావిస్తున్నా.. ముందస్తుకు వెళ్లకుంటే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనా ఆయనను వెన్నాడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హస్తిన పర్యటన వెనుక ముందస్తు మంతనాలు జరపడం అన్నదే ప్రధాన కారణమై ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

బండి సంజయ్ కు స్థాన భ్రంశం.. కేబినెట్ లోకేనా?

బీజేపీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు స్థానం భ్రంశం తప్పదన్న విషయం దాదాపుగా ఖరారైంది.  తెలంగాణ బీజేపీలో తలెత్తిన వర్గ పోరుకు ఫెల్ స్టాప్ పెట్టి.. పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలన్న నిర్ణయానికి ఆ పార్టీ హై కమాండ్ వచ్చేసిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడో ఇహనో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పిస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై పార్టీ హై కమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు అమిత్ షా, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఎల్ సంతోష్ ఈ విషయంపై విస్తృతంగా, సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేశారని కూడా అంటున్నారు.  కాగా సోమవారం (జులై 3)న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ భేటీలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర కేబినెట్ లోని కొందరిని పార్టీ అవసరాల కోసం తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రాలకు చెందిన కొందరిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలూ ఉన్నాయి.  ఇక మళ్లీ తెలంగాణ విషయానికి వస్తే.. బండి సంజయ్ ను కేబినెట్ లోకి తీసుకుని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది.  ఇక ఈటల రాజేందర్ కు కూడా  కీలక పదవి అప్పగించే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ కీలక నేతలే చెబుతున్నారు. ఆయనకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.   పార్టీలో సంస్థాగతంగా జరిగే మార్పులతో అసంతృప్తి తలెత్తి, నేతలు జారిపోకుండా ఇతర బాధ్యతలతో సంతృప్తి పరచాలన్న వ్యూహంతో బీజేపీ హైకమాండ్ ఉంది.    బీజేపీ ప్రధానంగా  ఈ ఏడాది చివరిలో  ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  మార్పు చేర్పుల విషయంలో ఆ రాష్ట్రాలపైనే బీజేపీ హై కోమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు విషయంలో పార్టీ అగ్రనేతల మధ్యే భిన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో  బండి సంజయ్ స్వయంగా కార్యకర్తలతో మాట్లాడుతూ మోడీ రాష్ట్ర పర్యటనలో తాను బీజేపీ రాష్ట్ర చీఫ్ హోదాలో పాల్గొంటానో లేదో తెలియదని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.  రాష్ట్ర పార్టీలో పలువురు నేతల మధ్య  సయోధ్య లేకపోవడంతో  ఏ నిర్ణయం తీసుకుంటే ఏమౌతుందన్న ఉత్కంఠ తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.   వరంగల్‌లో ఈ నెల 8న ప్రధాని కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఈటల రాజేందర్, బండి సంజయ్ ల మధ్య ఇసుమంతైనా సయోధ్య లేదన్న సంగతి వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి స్పష్టంగా తేలిపోయింది. ఈ సమావేశంలో వారిరువురూ ఎడముఖం, పెడముఖంగా వ్యవహరించారు.   

కాంగ్రెస్ వర్గ పోరు భూతం బీజేపీని ఆవ‌హించిందా!?

కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వ‌ర్గ‌ పోరు పార్టీ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా బంగాళాఖాతంలో ఎప్పుడూ నీరున్న‌ట్లు ఆ పార్టీలో నేత‌ల మ‌ధ్య నిత్యం వ‌ర్గం పోరు తారస్థాయిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వ‌ర్గ‌ పోరు పార్టీ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా బంగాళాఖాతంలో ఎప్పుడూ నీరున్న‌ట్లు ఆ పార్టీలో నేత‌ల మ‌ధ్య నిత్యం వ‌ర్గం పోరు తారస్థాయిలో ఉంటుంది. ప‌ద‌వుల విష‌యంలో, నాయ‌క‌త్వం విష‌యంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఆ పార్టీలోని నేత‌లు కుమ్ములాడుకుంటూనే ఉంటారు. వ‌ర్గ‌ పోరు ఆ పార్టీకి అనేక సార్లు అధికారాన్ని దూరం చేసినా నేత‌ల్లో మాత్రం మార్పు క‌నిపించ‌దు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 'వ‌ర్గ‌పోరు భూతం' ఎప్పుడూ ఆవ‌హించే ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌మ‌త్క‌రిస్తూ ఉంటారు. ప్ర‌స్తుతం ఈ వర్గపోరు భూతం బీజేపీని సైతం ఆవ‌హించిన‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌ పోరు తార స్థాయికి చేరింది. సాధార‌ణంగా బీజేపీలో నేత‌ల మ‌ధ్య విబేధాలు త‌క్కువ స్థాయిలోనే క‌నిపిస్తుంటాయి. ప్ర‌స్తుతం, తెలంగాణ బీజేపీలో నువ్వా నేనా అనే స్థాయిలో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌ పోరు న‌డుస్తుండ‌టం ఆ పార్టీ అధిష్టానాన్ని క‌లవ‌ర‌పాటుకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మూడు నాలుగు నెలలలో ఎప్పుడైనా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు బూచి చూపించి అనుకున్న దాని కంటే అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించిన కేసీఆర్‌. ఈసారి కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను బురిడీ కొట్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ పార్టీని గ‌ద్దెదించేందుకు   బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ ప‌డుతున్నాయి. రెండు పార్టీల నేత‌లు అధికారంలోకి వ‌చ్చేది మేమంటే మేమంటూ ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, రెండు పార్టీల్లోనూ నేత‌ల‌ వ‌ర్గ విబేధాలు ఆయా పార్టీల అధిష్టానాల‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి.  క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ క‌నీసం పోటీ ఇచ్చే ప‌రిస్థితుల్లో కూడా క‌నిపించ‌లేదు. అక్క‌డ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. రెండు నెల‌ల కాలంలోనే ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ పుజుకుంది. అదే స‌మ‌యంలో బీజేపీ ప్ర‌భావం త‌గ్గుతూ వ‌చ్చింది. దీంతో బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మైన నేత‌లుసైతం యూట‌ర్న్ తీసుకొని కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఒక్క‌సారిగా ప్ర‌జ‌ల్లో పెరిగిన గ్రాఫ్‌తో కేంద్ర అధిష్టానం సైతం అల‌ర్ట్ అయింది. రాష్ట్రంలోని ముఖ్య‌ నేత‌లంద‌రినీ ఢిల్లీకి పిలిపించి ఐక్యంగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆదేశాలిచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ కూడా పార్టీ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించి ఐక్యంగా ముందుకు సాగే విధంగా దిశానిర్దేశం చేసింది. ఎవ‌రైనా హ‌ద్దు దాటితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయంటూ రాహుల్ గాంధీ స్వ‌యంగా కాంగ్రెస్ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ నేత‌లు మేమంతా క‌లిసిపోయాంటూ కొత్త‌రాగం అందుకున్నారు.  కాంగ్రెస్ నేత‌లంతా ఐక్యతారాగం ఆల‌పిస్తున్న వేళ.. తెలంగాణ బీజేపీలో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ విబేధాలు  పీక్స్ కు చేరాయి. బీజేపీలో ఇలాంటి ప‌రిస్థితి గతంలో ఎన్నడూ కనిపించిన దాఖలాలు లేవు. ఒక‌వేళ  విబేధాలు ఉన్నా.. పార్టీలో అంత‌ర్గ‌తంగానే కొన‌సాగాయి. ఈసారి, బీజేపీలోని నేత‌లు బ‌హిరంగంగానే ఒక‌రిపై ఒక‌రు కాలుదువ్వుకొనే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. బండి సంజ‌య్‌ను అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తార‌ని, ఈట‌ల‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనికితోడు ఆ పార్టీలోని నేత‌లు కొంద‌రు బండి సంజ‌య్ ప‌ద‌వి ఊడిన‌ట్లేనంటూ ప్ర‌చారం చేయ‌డం పార్టీలో వ‌ర్గ విబేధాల‌ ఆజ్యం పోసిన‌ట్ల‌యింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ బీజేపీ నేత‌ల ప‌ట్ల కేంద్ర పార్టీ అధిష్టానం ఎలా వ్య‌వ‌హ‌రించాలో చెబుతూ.. మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి చేసిన వీడియో ట్వీట్ తెలంగాణ బీజేపీలో పెను దుమారాన్నే రేపింది. దీంతో ఈట‌ల వ‌ర్గం, సంజ‌య్ వ‌ర్గం అన్న‌ట్లుగా బ‌హిరంగంగానే ఆ పార్టీ నేత‌లు వాదులాడుకొనే స్థాయికి చేరింది.  ఆదివారం హ‌న్మంకొండ‌లో జ‌రిగిన బీజేపీ స‌భ‌లో కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, ఈట‌ల పాల్గొన్నారు. అయితే, ఈట‌ల‌, సంజయ్ ఎడ‌మొహం పెడ‌మొహంలానే ఉన్నారు. దీంతో ఎప్పుడూ కాంగ్రెస్‌ను ప‌ట్టిపీడించే వ‌ర్గ‌పోరు భూతం.. ఈసారి బీజేపీని  ఆవ‌హించింద‌ని రాజ‌కీయా విశ్లేష‌కులు చ‌మ‌త్క‌రిస్తున్నారు. అలాఅని కాంగ్రెస్‌ను సైతం వ‌ర్గ‌పోరు భూతం పూర్తిగా వీడ‌లేదు. దీంతో ఎన్నిక‌ల నాటికి ఈ రెండు పార్టీల్లోని నేత‌లతో వ‌ర్గ‌పోరు భూతం ఎన్ని విన్యాసాలు చేయిస్తుందో వేచి చూడాల్సిందే.

ఇడుపుల పాయకు సోనియా, రాహుల్.. షర్మిల పార్టీ విలీనం ఖాయమేనా?

పర్యవశానాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంత రేంజిలో రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ఇంకా చెప్పాలంటే గత తొమ్మిదేళ్లుగా నిస్తేజంగా కనిపించిన కాంగ్రెస్  ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిలించి పంజా విసిరేందుకు సిద్ధమైన సింహంగా కనిపిస్తోంది. కర్ణాటకలో  ఫలితాలకు అంతకు ముందే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రతో ఆ పార్టీలో వచ్చిన కదలిక తోడై కాంగ్రెస్ కోటలో మళ్ళీ అధికారంపై ఆశలు చిగురించాయి. దేశవ్యాప్తంగా ప్రజలలో కూడా ఈ పార్టీ పట్ల ఆసక్తి, ఆదరణ కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ పెద్దలు కూడా పరిస్థితికి అనుకూలంగా కొత్త కొత్త ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నారు.  అందుకోసం పాత మిత్రులను, కలిసి వచ్చే శత్రువులను సైతం కలుపుకొని వెళ్లేందుకు సై అంటున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో తమ నేతల మధ్య వైరాన్ని రూపుమాపి స్నేహాన్ని పెంచేలా చర్యలు మొదలు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలుగురాష్ట్రాల పార్టీ వ్యవహారాలను స్వయంగా పార్టీ అగ్రనాయకత్వమే పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తున్నది.  తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2024 సాధారణ ఎన్నికల ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడి ఫలితాల ప్రభావం దేశమంతా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకులను, కేసీఆర్ శత్రువులను ఇంకా కలిసి వచ్చే వారిని కలుపుకు పోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే భారీగా చేరికలు మొదలు కాగా,  పాత కాంగ్రెస్ నేతలను కూడా మళ్ళీ వెనక్కి వచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక, ఏపీ విషయానికి వస్తే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవాలంటే సామాన్య విషయం కాదు. అందుకే అధిష్టానం ఒక ప్రయత్నంగా వైఎస్ కుటుంబాన్నే ప్రయోగించాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఈ మధ్య తీవ్ర ప్రచారం జరిగింది.  కాగా, ఇప్పుడు ఈ వ్యవహారంపై ఏకంగా   సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ తో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడిపారు. షర్మిలను ఆయన రాష్ట్రం కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారనీ ప్రచారం జరిగింది. కాగా, ఇప్పుడు ఏకంగా సోనియా, రాహుల్ వైఎస్ఆర్ సతీమణి విజయమ్మతో సంప్రదింపులు జరపనున్నారని ప్రచారం మొదలైంది. ఇందు కోసం వేదిక కూడా ఖరారైంది. జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఆ రోజున సోనియా, రాహుల్ గాంధీ  కడప  జిల్లాలోని ఇడుపులపాయకు రానున్నారు. అక్కడి వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పించనున్నారు. ఇక్కడే వారు విజయమ్మతో భేటీ కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. సోనియా, రాహుల్ పర్యటనకు సంబంధించి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇడుపులపాయకు వచ్చి   ఏర్పాట్లు పరిశీలించి వెళ్లారని.. సెక్యూరిటీ టీం క్లియరెన్స్ ఇస్తే సోనియా రాక ఖాయం కానున్నట్లు తెలుస్తున్నది.   ఇదే నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు గుణాత్మకంగా మారతాయనడంలో సందేహం లేదు. వైఎస్ ఉన్నంత కాలం ఈ కుటుంబంతో సోనియా, రాహుల్ కు మంచి అనుబంధం ఉండేది. జగన్ కాంగ్రెస్ ను వ్యతిరేకించిన తర్వాత వ్యవహారం చెడింది. అయితే, ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా విడిపోయింది. తల్లి విజయమ్మ పూర్తిగా కుమారుడు జగన్ కు దూరంగా ఉంటూ కుమార్తె షర్మిలకు అండగా ఉంటున్నారు.. ఈ మధ్య షర్మిల పార్టీ వ్యవహారాలలో కూడా విజయమ్మ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియా, రాహుల్ స్వయంగా ఏపీకి వచ్చి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

మరోసారి ఢిల్లీకి జగన్.. రెండు రోజుల మకాం వెనక మతలబేంటి?

సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ఈ మేరకు జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 5, 6 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సీఎం జగన్ సమావేశం కానున్నారు. 5వ తేదీ రాత్రికి మోడీ, అమిత్ షాతో సీఎం భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోండగా.. ఆలస్యం అయితే 6వ తేదీ సమావేశం కానున్నారు. వీరితో పాటు ఢిల్లీలో మరికొందరు పెద్దలతో కూడా భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు, వైసీపీ నేతలు ఈ భేటీ గురించి ప్రచారం కూడా మొదలు పెట్టారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి, పోలవరం అడహక్ నిధులకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ కేంద్రం వద్దకు వెళ్తున్నారని చెప్తున్నారు.  అయితే, ఒకవైపు రాష్ట్రంలో, కేంద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల ముందు నుండే సీఎం జగన్ బీజేపీతో సఖ్యత పెంచుకున్నారు. ఇక సీఎం అయ్యాక మొదలు ఇప్పటి వరకు కేంద్రంలో తన అవసరం ఉన్నా లేకపోయినా.. బీజేపీ అడిగినా అడగకపోయినా బీజేపీ ప్రభుత్వానికి ప్రతి అంశంలోనూ మద్దతు ఇచ్చారు. అయితే, అప్పుడు పరిస్థితి వేరు.  ఇది ఎన్నికల సమయం. ఎవరికి వారికి ఇప్పుడు సొంత ఎజెండా  తప్పదు. దీంతో మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వానికి నొప్పి కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయని బీజేపీ పెద్దలు ఈ మధ్య టోన్ మార్చారు.  తాజాగా ఏపీకి వచ్చిన అమిత్ షా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వ అవినీతి పెచ్చుమీరిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో అన్నీ అక్రమాలే అంటూ దుయ్యబెట్టారు. జగన్ ప్రభుత్వంపై అమిత్ షా ఘాటు విమర్శల అనంతరం ఇప్పుడు తొలిసారి సీఎం జగన్ అమిత్ షా వద్దకు వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయి కూడా చాలా కాలం అయింది. ఆ మధ్య ఒకసారి కలుస్తారని ప్రచారం జరిగినా ఎందుకో అప్పుడు అది కుదరలేదు. మోడీ సైతం జూలైలో ఏపీకి వస్తారని, ఇక్కడ బహిరంగ సభ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈసారి కలయిక మీద చాలానే చర్చ సాగుతోంది.  ప్రస్తుత పరిస్థితిలో  జగన్ ప్రధానితో భేటీ కావడాన్ని రాజకీయంగా కీలకమైన పరిణామంగానే చూడాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఏపీ రాజకీయాలలో ఎన్నికల హీట్ ఎప్పుడో మొదలైంది. ఒక వైపు వైసీపీ వై నాట్ 175 అంటూ తన సంక్షేమం మీదనే ఆశలు పెట్టుకొని జగన్ బ్రాండ్ ఉపయోగించుకుని మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతుండగా.. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, సీఎంగా జగన్ చేసిన అప్పులు,తప్పులు,  రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరంగా ఇబ్బందులను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి తాము గద్దెనెక్కాలని ప్రతిపక్షాలు ఇప్పటికే వార్ మొదలు పెట్టాయి. మరో వైపు రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తులపై కూడా తీవ్ర ప్రచారం జరుగుతున్నది. టీడీపీ-జనసేన మధ్య దాదాపుగా పొత్తు ఖరారైందనీ, బీజేపీ కూడా కలిసే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో చర్చలు సాగుతున్నాయి. వైసీపీ ఒంటరైతే విజయానికి దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఇప్పుడు బీజేపీ పెద్దలతో భేటీ కావడం  ఆసక్తికరంగా మారింది. మరోవైపు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అత్యవసరంగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్  బెయిల్ మీద ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో కూడా కదలిక మొదలైంది. దీంతో ఎన్నికల ముందు ఈ రెండు కేసులు వైసీపీకి తలపోటుగా మారనున్నాయనే ఊహాగానాలు కూడా మొదలవగా.. ఇప్పటికిప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరనుండడం పలు ఊహాగానాలకు తావిస్తుంది. మరి ఈ రెండు రోజుల పర్యటన వెనుక మతలబేంటో.. ప్రధాని, అమిత్ షాలతో భేటీ వెనుక ఆంతర్యమేమిటో అన్నచర్చ జోరుగా సాగుతోంది.

ఏపీలో బీజేపీ తెరవెనుక వ్యూహం?

రానున్న ఎన్నికలలో ఏపీలో ప్రతిపక్షాల మధ్య పొత్తు ఉంటుందా? ప్రధాన పార్టీ టీడీపీతో జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తుందా? లేక గత ఎన్నికల మాదిరి విడిగానే బరిలో దిగుతారా? టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చాలాకాలం క్రితమే చెప్పేసినా ఈ మధ్య కాలంలో ఆయన ప్రసంగాలలో మాటలు ఎందుకు మారాయి? ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీ-జనసేన పొత్తులో కూడా ఉంటుందా? లేక జనసేనతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా పోటీచేస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీలో ఎక్కడ నలుగురు చేరినా జరుగుతున్న చర్చ. నిజానికి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని దాదాపుగా రాజకీయాలలో ఖరారైన అంశమే కాగా ఎందుకో.. ఎక్కడో జనసేన, బీజేపీ కదలికలు చూస్తే అనుమానించక తప్పట్లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందులో కూడా ప్రధానంగా బీజేపీ రాజకీయాల గురించి చూస్తే ఈ అనుమానానికి మరింత బలం చేకూరుతుంది. ఎన్నికలలో ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని రెండు భాగాలుగా విభజించుకోవాలి. ఏపీలో ఈ లెక్కన చూస్తే.. ప్రభుత్వ   వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన పంచుకుంటాయి. రాష్ట్రంలో బీజీపీకి ఉన్న ఓటు శాతం అత్యంత స్వల్పం. ఆ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇసుమంతైనా మళ్లే అవకాశాలు లేవు. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా వెళ్తే ఈ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కూటమి ఖాతాలో పడుతుంది. సరిగ్గా  ఇక్కడే బీజేపీ ఏమైనా రాజకీయాలు చేస్తున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  వైసీపీకి అధికారం దక్కలా వద్దా అన్న సంగతెలా ఉన్నా టీడీపీని దెబ్బ తీయాలనే ఆలోచన ఉంటే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జనసేన-బీజేపీ వైఖరి చూస్తే ఈ ఓటు చీల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రలో పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయకపోగా.. అక్కడక్కడా తానే సీఎం అనే మాటలు కూడా అన్నారు. దీనికి తోడు పవన్   వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పవన్ ప్రసంగాలు  వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అనేలా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ వైసీపీని తూర్పార పట్టిన పవన్ టీడీపీతో పొత్తుల గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. మూడు నెలల క్రితం వరకు పొత్తులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి చెప్పిందే చెబుతూ వచ్చిన పవన్ వారాహీ విజయయాత్రలో టీడీపీ ప్రస్తావన తేలేదు. దీంతో ఇది వ్యూహమా.. భవిష్యత్ సంకేతమా అనే చర్చ మొదలైంది.  పవన్ ఈ మధ్య కొత్తగా తనకు సీఎం అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని అడగటం, తనతో పాటుగా తన పార్టీ వారిని కూడా అసెంబ్లీకి పంపాలని కోరడం, ఒక్క అవకాశం తమకు ఇచ్చి చూడాలని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయడం ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలలో కొత్త కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు సీఎం తాను అయ్యే అవకాశం లేదని చెప్పిన పవన్.. ఈ మధ్య తానే సీఎం అవుతానని చెప్పటం వెనుక బీజేపీ వ్యూహం ఉందంటూ పరిశీలకులు విశ్లేషణలకు పని చెప్పారు.    పవన్ స్వతహాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే నమ్మకం ఎవరికీ కలగడం లేదు. బీజేపీ వయా పవన్ మీదగా రాజకీయ ఎత్తుగడలకు సిద్దమైందా అనే అనుమానాల బలంగా వ్యక్తమౌతున్నాయి.  ఈ మధ్య కాలంలో పవన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఒకటి టీడీపీతో గ్యాప్ అయినా పెరగాలి.. రెండు పొత్తులో డిమాండ్లు సాధించేలా ఒత్తిడి పెంచే ప్రయత్నం అయినా కావాలి. మూడు బీజేపీ ఏదైనా కొత్త ప్రణాళిక రచించి అది పవన్ తో అమలు చేయిస్తునైనా ఉండాలి. దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ శైలిని చూస్తే చాలా రాష్ట్రాలలో ఇలా పాత మిత్రులను సైడ్ చేసి తాను ఎదుగుతూ రావడం గమనించొచ్చు. ఏపీలో కూడా బీజేపీ ఇలాంటి పన్నాగం ఏమైనా పన్నిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి టీడీపీ సింగల్ గా పోటీచేసినా ప్రభుత్వాన్ని నెలకొల్పే సీట్లను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నాయి. టీడీపీ నేతల్లో కూడా ఈ ధీమా కనిపిస్తున్నది. అదే ఇప్పుడు బీజేపీకి మింగుడు పడక తెరవెనక దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు. రాజకీయం అంటే రాజకీయమే కదా..   లోగుట్టు ఆ పెరుమాళ్ళకెరుక!

మ‌ద్య నిషేధం నా వల్ల కాదు.. కుండబద్దలు కొట్టేసిన పవన్

ఒకప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలలో ప్రజా పాలన, ప్రజా రక్షణ పక్కన పెట్టి ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి.. దాన్నే విమర్శలగా మలచి దాడులు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇలా నేతలు తిట్టి పోసుకుంటుంటే కార్యకర్తలు దీన్ని తలా ఒక చేయి వేసి ఆజ్యం పోస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. ఒకరకంగా ఇదో రకం డైవర్షన్ పాలిటిక్ లాగా తయారైంది. ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ లో వైసీపీ నేతలు డాక్టరేట్స్ పొందారు. సాక్షాత్తు సీఎం నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా చాలామంది నేతలు ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయారు. అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు వైసీపీ నేతలు ఎంచుకున్న బాష దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్. అప్పుడప్పుడు ఆయన పెళ్లిళ్లను కూడా హైలెట్ చేస్తుంటారు. అలా సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ మాదిరిగా మనం నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేం అంటూ విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో కూడా జగన్ మరోసారి సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం ఓ దత్తపుత్రుడు లారీ ఎక్కి ఊగిపోతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనలా మ‌నం రౌడీల్లా తొడ‌లు కొట్ట‌లేం.. బూతులూ తిట్టలేం.. వారిలా న‌లుగురిని పెళ్లి చేసుకుని, నాలుగేళ్ల‌కోసారి భార్య‌నూ మార్చ‌లేం.. పెళ్లి అనే పవిత్ర వ్య‌వ‌స్థ‌ను రోడ్డుమీదికి తీసుకురాలేం.. అవ‌న్నీ ప‌వ‌న్‌కు మాత్రమే సాధ్యం అంటూ సెటైర్లు వేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న భావితరం, స్కూల్ పిల్లలున్న సభలో ఇలా పెళ్లిళ్ల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి విమర్శలు చేయడం కరెక్టేనా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా సీఎం జగన్.. పవన్ మీద ఇలా నోరు పారేసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లే. అది ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆయనే పలుమార్లు కామెడీగా చెప్పారు.. సీరియస్ గా హెచ్చరిస్తూ కూడా చెప్పారు. అయినా విమర్శించడానికి, మట్టాడడానికి ఇంకేం అంశాలు లేవన్నట్లు సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారి ఇలా  వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఇప్పుడు జన సైనికులు సీఎం జగన్ టార్గెట్ గా వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. జగన్ తాతల కాలం నుండి వారి కుటుంబంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఉదాహరణగా చూపిస్తూ పోస్టులు కుమ్మరిస్తున్నారు. జగన్ తాత రాజారెడ్డికి ఇద్దరు భార్యలన్న సంగతి అందరికీ తెలిసిందే. రెండో భార్య సంతతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రాజా రెడ్డి మొదటి భార్యకు మనవడే అవినాష్ రెడ్డి. దీన్నే కోడ్ చేస్తూ సీఎం జగన్ ను విమర్శలతో ఏకి  పారేస్తున్నారు  జనసైనికులు. ఇక జగన్ సోదరి షర్మిళ విషయాన్ని కూడా సీన్ లోకి తెస్తున్న కొందరు  విమర్శలకు దిగుతున్నారు. ఇక, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా రెండో పెళ్లి సంగతి కూడా ఆయన మరణానంతరం ఓపెన్ అయిన సంగతి గుర్తుచేస్తున్నారు. అలాగే  ఆయన హత్యను కూడా కలిపి సోషల్ మీడియా వాల్స్ బద్దలయ్యేలా  నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, జనసేన నాయకుల్లో ఒకరైన డాక్టర్ సందీప్ అయితే ఒక టీవీ ఛానెల్ చర్చలో 'జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారా. మరి ప్రత్యేక హోదా ఏదీ?.. జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారా.. మరి సీపీఎస్ రద్దు చేశారా? జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారు.. మరి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారా’.. అంటూ జగన్ వైఫల్యాలను కూడా పెళ్ళితోనే ముడిపెట్టి ఎండగట్టారు.   జనసేన సోషల్ మీడియా ఖాతాలలో అయితే.. ప్రశ్న: ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రశ్న: పోలవరం ఎందుకు కట్టలేకపోయారు?, జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు, ప్రశ్న: రాజధాని మాటేంటి? మన రాజధాని ఏది? జగన్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పడుతున్నారు. దీంతో జగన్ అడిగి మరీ తిట్టించుకున్నట్లే అయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.