వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే అంతే..
posted on Aug 18, 2016 @ 10:41AM
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో గెలుస్తోమో లేదో అన్న భయం భాగానే పట్టుకున్నట్టు ఉంది. అందుకే ఆయన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని పార్టీ నేతలకు కాస్త గట్టిగానే ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య.. సదరు ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మిమ్మల్ని అందరినీ గెలిపించాలన్నదే నా తాపత్రయం.. మీరంతా గెలిస్తేనే తాను నిలబడతానని.. రెండోసారి ఓడిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.. అందువల్లే ప్రజలతో ఉండండి. ప్రజలు మనలను విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి. అధికారంలోకి వస్తే ప్రతి మాటనూ నిలబెట్టుకుంటా. మీ నియోజకవర్గాల్లో మీరిచ్చే హామీల అమలుకూ సహకరిస్తా’’ అని ఆయన పార్టీ నేతలతో అన్నారు. మొత్తానికి జగన్ కు ఇన్ని రోజులకు కాస్త జ్ఞానోదయం అయినట్టు ఉంది.