నీ పాలనతో రాజారెడ్డి మనవడినని ప్రూవ్ చేసుకుంటున్నావా.. జగన్ పై మండిపడ్డ యువతి
posted on Jan 5, 2021 @ 12:57PM
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుపై ఓ యువతి తీవ్రస్థాయిలో మండిపడింది. "అబ్బబ్బబ్బబ్బా.. ఏం పరిపాలన జగన్మోహన్ రెడ్డి.. నీ పరిపాలనలో పేకాట ఆడినా తప్పులేదు.. ఆడపిల్లలను మానభంగాలు చేసినా, చంపేసినా తప్పులేదు.. నడిరోడ్డుపై పట్టపగలు ఓ మనిషిని నిర్ధాక్షిణ్యంగా చంపేసినా దిక్కూ మొక్కూ ఉండదు.. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసినా తప్పులేదు.. కానీ ప్రభుత్వం చేసిన తప్పులను ఎవరైనా ప్రశ్నించినా.. చిన్న పోస్టు పెట్టినా.. వాళ్లపై కేసులు పెట్టడం, చంపేయడం చేస్తున్నారు. ఏం రాజ్యమిది.. నువ్వు రాజారెడ్డి మనవడినని ఫ్రూవ్ చేస్తున్నావా? పులివెందుల పంచాయితీలు, రాజకీయాలను రాష్ట్రమంతటా పాకించాలని అనుకుంటున్నావా..?. రాజన్న రాజ్యం తీసుకువస్తానన్నావ్. కానీ నీ రాజ్యంలో సాక్షాత్తు రాముడికి కూడా సేఫ్టీ లేదు. ఇక ప్రజలు ఎలా బ్రతకాలి? రాష్ట్రాన్ని, ప్రజలను ఏం చేద్దామని అనుకుంటున్నావ్.. నీవు ఎలా ఉన్నావో.. నీ మంత్రులు కూడా అలాగే ఉన్నారు. నీవు రాజ్యాంగాన్ని గౌరవించి.. పాలించాలి, రాజ్యాంగమంటే నీవు రచించుకున్న రాజారెడ్డి రాజ్యాంగం కాదు జగన్మోహన్ రెడ్డీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం.. అది నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. దీనికి ఎవరూ అతీతులు కాదు.. అందులో నీవు మొదటివాడివి.. ఇదొక పరిపాలన అనుకుంటున్నావా? ఎన్ని రోజులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, చంపించి, కేసులు పెట్టించి పాలించాలనుకుంటున్నావ్.. దీనిపై తిరుగుబాటు తప్పదు.. ఒక్కసారి తిరుగుబాటు మొదలైతే నీ పతనం మొదలౌతుంది. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డీ’’ అంటూ ఆ యువతి మాట్లాడిన వీడియోను పోస్టు చేసింది. తాజాగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.