టీడీపీలో అసంతృప్తి.. మళ్లీ వైసీపీ దారి..
posted on Jun 22, 2016 @ 6:14PM
ఏదో ఆవేశంతో వేసీపీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు కానీ. కొంత మంది నేతల్లో ఎక్కడ ఓ దగ్గర అసంతృప్తి మాత్రం ఉందని చెప్పొచ్చు. అలా వెళ్లిన నేతలే కొంత మంది ఇప్పుడు తిరిగి సొంత గూటికి వచ్చేశారు. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి ఎంపీపీ, ఎంపీటీసీలు తిరిగి సొంత గూటికి వచ్చేశారు. అంతేకాదు తిరగొచ్చిన వారు ఇటీవల టీడీపీలో చేరిన అమర్ నాథ్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి తమపై ఒత్తిడి చేసి తీసుకెళ్లి, టీడీపీ కండువాలు కప్పించారని.. ఆరోపించారు. ఇక వీరి రాకతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇంకా చాలా మంది నేతలే టీడీపీలోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్నారు.. వారు కూడా త్వరలోనే పార్టీలోకి వస్తారని అన్నారు. ఏ అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయిస్తున్నారని ప్రజల అభివృద్ధి కోసమా? లేక స్వీయ అభివృద్ధి కోసమా? అన్నది చెప్పాలని విమర్శించారు.