Read more!

రేప్‌కి గురైనవారిని ఉరితీయాలి: అబు అజ్మీ

 

 

 

సమాజ్‌వాది పార్టీ నాయకులు అందరిచేతా ఛీ కొట్టించుకునే స్టేట్‌మెంట్లు ఇచ్చి ఈ ఎలక్షన్లలో అదనపు ప్రచారం పొందాలని ప్రయత్నిస్తున్నట్టుగా వుంది. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నిన్న ఏదో కుర్రాళ్ళు రేప్ చేసినంతమాత్రాన ఉరిశిక్ష వేసేస్తారా అని ఆవేశంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ములాయం చేసిన వ్యాఖ్యల మీద దేశమంతా భగ్గుమంటోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు. పార్టీ అధ్యక్షుడు ములాయంసింగే పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తుంటే నేను మాత్రం ఎందుకు చేయకూడని అనుకున్నాడేమో సమాజ్‌వాది పార్టీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మీ ములాయం సింగ్‌కి మించిన కామెంట్స్ చేశాడు. ‘‘భర్తతో కాకుండా పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను ఉరితీయాలి. అలాగే రేప్‌కి గురైన మహిళలను కూడా ఉరితీయాలి. ఎందుకంటే ఒక మహిళ ఒక పురుషుడితోనే సంబంధం కలిగి వుండాలి’’ అని దారుణంగా వ్యాఖ్యానించాడు. రేప్‌కి గురైన మహిళను సదరు రేపిస్టుతో కలిపి ఉరి తీసేయాలని అబు ఆజ్మీ చెప్పాడు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఇలా చెయ్యమని ఇస్లాంలో చెప్పారని అంటున్నాడు.