Read more!

వాస్తుతో పాటు జగన్ ఈ పనులు కూడా చేయాలి...

ఐదేళ్ళపాటు చేయకూడని అరాచకాలు అన్నీ చేసిన జగన్, ఇప్పుడు అధికారం చేజారిపోతోందని అర్థం చేసుకుని ఆందోళన పడిపోతున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అమల్లో పెట్టేశారు. ఇనుప కాంపౌండ్ వాల్‌కి సంబంధించిన రిపేర్లు చేశారు. గోడ ఎత్తు తగ్గించడం యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిపోయింది. వాస్తు దోషాలను సరిచేశారు సరే... మరి మిగతా దోషాల సంగతేంటి?

-- అద్బుతమైన రాజధానిగా రూపొందే అమరావతిని పాడుబెట్టేసి ఘోస్ట్ సిటీగా మార్చేశారు. మరి ఈ దోషానికి పరిహారం ఏమిటి?
-- ఈ ఐదేళ్ళలో జగన్ అండ్ కో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. మరి ఆ తప్పుకు దండన ఏమిటి?
-- కల్తీ మద్య ప్రవాహంతో వేలాది ప్రాణాలు గాల్లో కలసిపోయేలా చేశారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి?
-- హత్యారాజకీయాలు చేసి ఎంతోమంది టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీశారు.. ఆ ఘోరాలకు శిక్ష ఏమిటి?
-- రాష్ట్ర విభజన తర్వాత ముందడుగులో వున్న రాష్ట్రాన్ని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి?
-- పరిశ్రమలను తరిమేసి, ఉపాధి అవకాశాలను పాతాళంలోకి పడేసి లక్షలాది మంది యువకుల జీవితంలో ఐదేళ్ళ కాలాన్ని వృధా చేశారు. ఏం చేస్తే ఈ పొరపాటు సరిదిద్దడానికి వీలవుతుంది?
-- ఈ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఆశీస్సులతో జరిగిన నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, ఆర్థిక నేరాలు... వీటన్నిటి సంగతేమిటి?
.... ఇవి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాల్లో కొన్ని... మరి ఇలాంటివన్నిటినీ మరచిపోయి, ఒక్క వాస్తు దోషం సరిచేస్తే అధికారం వచ్చేస్తుందని ఆశించడం అజ్ఞానం కాక మరేమవుతుంది?