ఏసీబీ కార్యలయం వద్ద తెరాస ఎమ్మేల్యే.. సర్వత్రా ఆసక్తి
posted on Jul 15, 2015 @ 6:31PM
నోటుకు ఓటు కేసులో తెరాస ఎమ్మెల్యేకు కూడా తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేయనున్నదని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి ఈ రోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయాలనుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను ఏసీబీ కార్యాలయానికి వచ్చానని అన్నారు. కాగా మీడియా ప్రతినిధులు మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా జవాబు చెప్పేందుకు నిరాకరించారు. అయితే ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయగా తాజాగా తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ కీర్తన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా కృష్ణ కీర్తన్ ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు.