టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
posted on Mar 10, 2013 @ 12:38PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. వర్గాలు, ప్రాంతాల మధ్య సమతుల్యత కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను రెడీ చేశారు. యనమల రామకృష్ణుడు, ఎంఏ సలీం, శమంతకమణిల వైపు మొగ్గుచూపారు. వారిని పెద్దల సభకు పంపాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ పేర్కొంది.