రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన షిండే
posted on Feb 20, 2014 @ 2:26PM
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు షిండేకు రక్షణగా కాంగ్రెస్ ఎంపీలు, మార్షల్స్ నిలబడ్డారు. సభలో బిల్లును ప్రవేశపెట్టగానే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎంసీ బిల్లును అడ్డుకొనేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య సభలో తోపులాట జరిగింది. బిల్లు రాజ్యంగా విరుద్దమని సభలో సభ్యులు నినాదాలు చేశారు. తెలంగాణ బిల్లు రాజ్యంగ బద్దంగా లేదని పలువురు సభ్యులు స్పీకర్ కు నోటిసులు ఇచ్చారు. సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొనడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.