ఏటీఎం సెంటరే.. స్టడీ రూమ్..
posted on Apr 12, 2021 @ 12:11PM
ఈ రోజుల్లో తల్లిదండ్రులు బలవంతం చేస్తే కానీ చదవరు. కానీ ఇతను మాత్రం ఒక వైపు ఉద్యోగం చేస్తున్నాడు. మరో వైపు చదువుతున్నాడు. అది ఏ స్టడీ సెంటరో, స్టడీ హలో కదండీ బాబు. తాను ఉద్యోగం చేసే ఏటీఎం సెంటరే తన స్టడీ రూమ్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇతని ఏకాగ్రత, పట్టుదలకు నెటిజన్లు నీ డెడికేషన్ లెవల్కి నా సలాం కొడుతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో మాత్రం చదవుకు కావాల్సింది ఆసక్తి, శ్రద్ధ మాత్రమేనని చాటి చెబుతోంది. లక్ష్యాన్ని చేరకోవాలంటే కావాల్సింది ఏకాగ్రత, పట్టుదలేనని నిరూపిస్తూ ఓ యువకుడు తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూనే తనకిష్టమైన చదువును కోనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
తన కుటుంబానికి చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఓ యువకుడు ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. చేసే పని చిన్నదా పెద్దదా అనేది ఆలోచించకుండా తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అయితే రాత్రి పూట కస్టమర్ల తాకిడి పెద్దగా ఉండదు కాబట్టి ఆ సమయంలో ఖాళీగా ఉండడం కన్నా చదువుకోవడం బెటర్ అని భావించాడు. ఇంకేముంది ఏటీఎం కేంద్రంలోనే చదవడం మొదలు పెట్టాడు. చదవాలనే కోరిక ఉంటే చాలు కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని చదుకునే వీలుంటుందని నిరూపించాడు.
ఈ ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి విద్యార్థి ఉన్నాడా అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఇలా ఏకాగ్రతతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. కలెక్టర్లు. ఐపీఎస్ అయిన వారు కూడా ఇలా సెక్యూరిటీ గార్డ్ లుగా పని చేశారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
చినిగిన చొక్కా అయినా తొడుకో గానీ.. ఒక మంచి పుస్తకం కొనుకో అన్నారు. పూర్వం కొంత మంది ఎసి రూముల్లో చదివితే. ఇంకొంత మంది వీధి దీపాల కింద చదువుకున్నారు. ఎసిలో చదివిన వాళ్ళు, వీధి దీపాల కింద చదివిన వాళ్ళు చాలా మంది మేధావులు అయ్యారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చదువుకోవాలంటే ఎసి తప్పని సరిగా మారింది చాలా మంది పిల్లలలు.. మా పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు కూడా పిల్లలను గారాబం చేస్తున్నారు.. అయినా పిల్లలో చదువు పట్ల మార్పు రావడం లేదు. చదవమని ఎంత ఫోర్స్ చేసిన, ఎన్ని అవకాశాలు కల్పించిన చదవడం లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇది ఇలా ఉంటే స్టడీ రూమ్స్ అని, స్టడీ లైబ్రరీ అని రకరకాల పేర్లు పెట్టి డబ్బులు దడ్డుకుంటున్నారు చాలా మంది. చదువును వ్యాపారం చేసి జేబులు నింపుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఓకే , మరి డబ్బులు లేనివాళ్ళ పటిస్థితి ఏంటి..?