సింధూకి అవమానం...ఆమె బంగారు పతకం సాధించలేదు
posted on Aug 19, 2016 @ 2:32PM
భారత బ్యాడ్మింటన్ పీవీ సింధూ ఎట్టకేలకు ఫైనల్స్ కు చేరి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. నిన్న రాత్రి హోరా హోరీగా సాగిన మ్యాచ్లో జపాన్ క్రీడాకారిణిని చిత్తుగా ఓడించి ఫైనల్ కు చేరిన పీవీ సింధూ ఈ రోజు ఆఖరికి పోరుకు సన్నద్దమవుతోంది. అయితే ఈ మ్యాచ్లో సింధూ ఎలాగైనా సరే గెలిచి గోల్డ్ మెడల్ సాధించాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. యావత్ భారతదేశం మొత్తం సింధూకు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రముఖ కాలమిస్ట్ శోభాడే మాత్రం సింధూను అవమానపరుస్తూ ఓ ట్వీట్ చేశారు. సింధూ బంగారు పతకం సాధించలేదు అంటూ... సిల్వర్ ప్రిన్సెస్ గా సింధూను అభివర్ణించింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్స్ పై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క అందరూ సింధూ గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటుంటే.. శోభా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ మండిపడుతున్నారు.