మేం రెడీగా ఉన్నాం.. భారత్ రెడీగా ఉందా.. పాక్ ప్రధాని
posted on Oct 15, 2016 @ 6:14PM
భారత్-పాక్ మధ్య చర్చలు జరిగే సమయం దగ్గరపడుతున్నాయి అనుకున్న నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ పై దాడి జరిపారు. దీంతో చర్చలు కాస్త వాయిదా పడ్డాయి. అప్పటి నుండి చర్చలు జరగనేలేదు. ఇక ఇప్పుడు వాటికి తోడు ఉరీ దాడి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ దాడులు. ఈ నేపథ్యంలో ఇకపై భవిష్యత్తులో కూడా ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. మూడో రోజుల పర్యటనలో భాగంగా అజర్ బైజాన్, బాకులో ఉన్న పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడాతూ.. భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నాం.. భారత్ కూడా భావించినట్లయితే అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని షరీష్ తెలిపారు. కశ్మీర్లో కొనసాగుతున్న హింస, ఇతర ముఖ్య సమస్యలపై చర్చించాలని పాక్ పలు పర్యాయాలు భారత్ కు ఆహ్వానం పంపినా ప్రయోజనం లేకపోయిందన్నారు.