త్వరలో మోడీ తెలంగాణ పర్యటన.. కేటీఆర్ విమర్శలు పనిచేశాయా..?
posted on Jan 19, 2016 @ 9:49AM
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఎక్కువగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంత కాలం అయిన మోడీకి తెలంగాణకు మాత్రం రాలేదు.. తెలంగాణ భారతదేశంలో లేదా..? తెలంగాణలో ప్రారంభించే ఎన్నో కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా రావాలని మోడీని ఆహ్వానించాం.. కానీ తాను మాత్రం రాలేదు.. కనీసం రాకపోతే రానని అయినా చెప్పాలి కదా అంటూ ఇలా పలు సందర్బాల్లో కేటీఆర్ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు కేటీఆర్ పదే పదే అనడం వల్లేమో మోడీ త్వరలో తెలంగాణ పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి ఫిబ్రవరీ మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ మేనల్లుడు.. మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారని.. దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ఆవిర్భావం తరువాత నరేంద్ర మోడీ తొలి పర్యటన ఇదే.