-->

కొడుకు ను చూసి పవన్ కళ్యాణ్ భావో ద్వేగం

సింగపూర్ లో ఐసియులో కొడుకు మార్క్ శంకర్ ఉండటాన్ని చూసి ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుక్కున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో బెడ్ పై కొడుకు ను చూసి పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట చిరు దంపతులు కూడా ఉన్నారు. కొడుకు మార్క్ శంకర్ కు సింగపూర్ వైద్యులు బ్రాంకోస్కోపి చేశారు. ప్రస్తుతం  శంకర్ ఆరోగ్యం నిలకడగా  ఉంది. కొడుకు ను చూసిన తర్వాత  పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుక్కున్నసమయంలో స్పందించిన నేతలకు పవన్ కళ్యాణ్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. నా పెద్ద కొడుకు అకీరా  పుట్టిన రోజు నాడే  నా చిన్న కుమారుడు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలకు గురైన సంగతి తెలిసిందే 

Teluguone gnews banner