అజహర్ విషయంలో భారత్ కు అనుకూలంగా చైనా..
posted on May 20, 2016 @ 12:20PM
పఠాన్ కోట్ విమానం స్థావరంపై ఉగ్రవాదులు దాడికి సూత్రధారి అయిన మౌలానా మసూద్ అజహర్ ను పట్టుకునేందుకు భారత ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అజహర్ కు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే ఇప్పుడు అజహర్ విషయంలో చైనా కూడా భారత్ కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా భారత్ కు చైనాకు మధ్య సత్సంబంధాలు లేని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అజహర్ విషయంలో మాత్రం భారత్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు చైనా ముందుకు వచ్చింది. మౌలానా మసూద్ అజర్ ను ఐరాసా నిషేధించిన ఉగ్రవాదుల జాబితాలో చేర్చు విషయంలో భారత్ తో సన్నిహితంగా వచ్చామని చైనా నిన్న పేర్కొంది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఈ రోజు ట్వీట్ చేశారు.