పెరిగిపోయిన ఉత్తర కొరియా పైశాచికం....సరిగా కూర్చోలేదని ఉపప్రధానికి ఉరిశిక్ష
posted on Sep 1, 2016 @ 10:28AM
ఉత్తర కొరియా నియంత కిమ్-జాంగ్ ఉన్ పైశాచికం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చక పోతే ఏకంగా మరణశిక్షనే విధిస్తూ తన మూర్ఖత్వాన్ని నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికే కిమ్-జాంగ్ ఉన్ పలువురిని నిర్ధాక్షిణ్యంగా చంపిచేశాడు. గత రెండు రోజుల క్రితం కూడా ఓ మంత్రిని, ఇద్దరు అధికారులను ప్రజల మధ్య చంపించిన కిమ్-జాంగ్ ఇప్పుడు ఉప ప్రధానిని కూడా ఉరితీయించినట్టు తెలుస్తోంది. అది కూడా చాలా సిల్లీ రీజన్ తో. వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షతన ఓ సమావేశం జరుగగా ఆకార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపప్రధాని సరిగా కూర్చోలేదన్న కోపంతో ఆయనను అరెస్ట్ చేసి విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత అతనిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, దేశంలో విప్లవాన్ని లేవదీస్తున్నాడని అభియోగాలు మోపీ అతనిని ఉరితీయించారు. మొత్తానికి కిమ్-జాంగ్ ఉన్ అరాచకాలకు అడ్డుకట్టలేకుండా పోతుందని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు కూడా ఉరిశిక్షలు వేస్తే... పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్లని ఎలా శిక్షిస్తాడో..