ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ
posted on Mar 26, 2021 @ 9:29PM
ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ ను ప్రభుత్వం నియమించింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. జగన్ సర్కార్ ప్రతిపాదనను గవర్నర్ ఆమోదించారు. దీంతో నీలం సాహ్నిని ఎస్ఈసీగా త్వరలో బాధ్యతలు చేపడుతారు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఎస్ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రభుత్వం ప్రాతపాదించింది. చివరికి సాహ్నిని ఎంపిక చేశారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన సెక్రటరీగా పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ను ప్రధాన సలహాదారుగా నియమించారు. సాహ్ని రెండేళ్ల పాటు సలహాదారుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడామే ఎస్ఈసీగా నియమితులు కావడంతో.. సీఎం సలహాదారు పదవికి నీలం సాహ్నీ రాజీనామా చేయనున్నారు.
1984వ ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం టెక్కటి సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. తర్వాత నల్గొండ జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా పనిచేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటి సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పనిచేశారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పనిచేశారు. కుటుంబశాఖలో పలు విభాగాల్లో పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఏపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విమరణ పొందారు.