Read more!

ఎన్టీఆర్ రాజును సత్కరించిన నారా లోకేష్

స్వర్గీయ నందమూరి తారకరామారావు వీరాభిమాని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు ఎన్టీఆర్ రాజును తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సత్కరించారు.  నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, ఆ తరువాత ఎన్టీఆర్ రాజును కలిసి ఆయనను శాలువతో సత్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి  తన తండ్రి  అభిమానిగా ఎన్టీఆర్ రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు వివరించారు. నారా లోకేష్, బ్రహ్మణి  ఎన్టీఆర్ రాజుతో  తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ  సందర్భంగా నారా దేవాన్ష్ కు ఎన్టీఆర్ రాజు శుభాశీస్సులు అందించారు.