భారత్ పై దాడులు జరపడానికి అనుమతివ్వండి.. మసూద్ అజర్
posted on Oct 13, 2016 @ 11:50AM
భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కూడా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతూనే ఉంది. అయితే ఇప్పుడు జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కూడా భారత్ పై దాడులు జరపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన.. ఇండియాలోకి దూసుకెళ్లి, సైనిక స్థావరాలపై దాడులను జరిపేందుకు తమకు అనుమతించాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కాశ్మీర్ ను పూర్తిగా ఆక్రమించుకునేలా చారిత్రక అవకాశం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో ఉందని, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే అవకాశం చేజారుతుందని జైషే వార పత్రిక 'అల్ కాలామ్'లో ఆయన పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. భారత్ జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఇవ్వాలని, అందుకు కాశ్మీర్ ను కానుకగా తెచ్చిస్తామని ఆయన అన్నట్టు తెలుస్తోంది.