ప్రధానిగా నితీష్, ఉపప్రధానిగా కేజ్రీవాల్ కావాలంట..!
posted on May 2, 2016 @ 9:07PM
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కేండేయ కట్జూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానిగా నితీష్ కుమార్ను, ఉప ప్రధానిగా అరవింద్ కేజ్రీవాల్ను ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఉన్నంతలో ఉత్తములను ఎంచుకోవాలనే లక్ష్యంతో వీరిని సూచించానని ఆయన చెప్పారు. నితీష్ కుమార్, కేజ్రీవాల్లు వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొలేదని ఆయన తెలిపారు. అందుకే వారిని ప్రధాని, ఉప ప్రధానిగా ఎన్నుకోవాలని సూచిస్తున్నానన్నారు. సాధారణంగా తాను రాజకీయ నాయకులను విమర్శిస్తుంటానని తెలిపారు. గతంలో వీరిని కూడా విమర్శించానని ఆయన చెప్పారు.