Read more!

వైకాపా దొంగల పార్టీ: మారెప్ప

 

సంచలనాత్మక వ్యాఖ్యానాలు చేయడంలో సిద్ధహస్తుడైన  రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మారెప్ప జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని అభివర్ణించారు. జగన్ అధికారంలోకి వస్తే శ్మశానాలని కూడా అమ్మేస్తాడని విమర్శించాడు.  ఈ ఎన్నికలలో టిక్కెట్లు అమ్ముకుంటూ జగన్ వందల కోట్లు తన ఖజానాలో వేసుకుంటున్నాడని మారెప్ప అన్నారు. జగన్ గెలిచినా, ఓడినా జైలుకు వెళ్ళడం ఖాయమని మారెప్ప జోస్యం చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన మారెప్ప వైఎస్సార్ మరణం తర్వాత జగన్ పార్టీలో చేరారు. అయితే అక్కడి విధానాలతో విసిగిపోయిన మారెప్ప ఆ పార్టీ నుంచి బయటకి వచ్చేశారు. పార్టీ నుంచి బయటకి వచ్చినప్పటి నుంచి జగన్‌ని తిట్టిపోయడంలో మారెప్ప బిజీగా వున్నారు.