Read more!

టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరింది

 

 

 

టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చర్చలు ఫలప్రదమయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన జవదేకర్ బృందంతో చంద్రబాబు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. తెలంగాణలో బీజేపీకి 45 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. అలాగే సీమాంధ్రలో 15 అసెంబ్లీ స్థానాల్లో, 5 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ అంగీకరించింది. దీనితో గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య జరిగిన పొత్తుల ప్రతిష్టంభన ముగిసి, కథ సుఖాంతమైంది. టీడీపీతో పొత్తు కుదుర్చుకోరాదంటూ తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేసినా, కొందరు స్థానిక నాయకులు రాజనామాలు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకే మొగ్గు చూపింది.