మహారాష్ట్రలో రైలు ప్రమాదం: 21మంది మృతి
posted on May 5, 2014 @ 11:11AM
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దివా-సావంత్వాడి పాసింజర్ రైలు ఇంజన్సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో 21మంది ప్రయాణికులు మరణించగా, 145 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు నాగోధానే, రోహాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి 10వేల ఎక్స్గ్రేషియా ఇస్తామని రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, జిల్లా ఇన్చార్జి మంత్రి సునీల్ తత్కరే ఆదివారం సాయంత్రం ప్రమాదస్థలి వద్దకు చేరుకుని సహాయచర్యలను సమీక్షించారు.
Maharashtra Train Accident Photos