Read more!

బుధవారం లోక్‌సభ పోలింగ్‌లో మహామహులు...

 

 

 

బుధవారం నాడు జరిగే ఏడో విడత పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, యు.టి.లలోని 89 లోక్‌సభ స్థానాలలో ఓటింగ్ జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జమ్ము అండ్ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, డామన్ అండ్ డ్యు, దాద్రా అండ్ నగర్ హవేలీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడత ఎన్నికల బరిలో భారతీయ జనతాపార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (వదోదర), అగ్ర నాయకులు ఎల్.కె.అద్వానీ (గాంధీ నగర్), మురళీ మనోహర్ జోషి (కాన్పూర్), అరుణ్ జైట్లీ (అమృత్‌సర్), ఉమా భారతి (ఝాన్సీ), వినోద్ ఖన్నా (గురుదాస్ పూర్) రంగంలో వున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (రాయబరేలి), కెప్టెన్ అమరీందర్ సింగ్ (అమృత్‌సర్), రీటా బహుగుణ (లక్నో), అంబికా సోని (ఆనంద్ పూర్ సాహిబ్) రంగంలో వున్నారు. వీరితోపాలు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా (శ్రీనగర్), జేడీయు అధ్యక్షుడు శరద్ యాదవ్ (మాధేపురా) రంగంలో వున్నారు.