లోథా కమిటీ ఎక్కువ చేస్తోంది.. డబ్బులివ్వకుండా మ్యాచ్ లు జరుగుతాయా?
posted on Oct 4, 2016 @ 12:07PM
లోథా కమిటీ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ సూచనలు పాటించకుండా మెంబర్ క్రికెట్ అసోసియేషన్లకు నిధులను మంజూరు చేయాలని నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. అంతేకాదు బీసీసీఐ నిధుల పందేరాన్ని ఆపాలంటూ బ్యాంకులకు లేఖ కూడా రాసింది. అయితే లోథా నిర్ణయంపై ఇప్పుడు బీసీసీఐ మండిపడుతుంది. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ తో జరగాల్సిన టెస్ట్, సిరీస్ మ్యాచ్లలను రద్దు చేయాలని చూస్తుంది. బ్యాంకు ఖాతాలను జస్టిస్ లోథాకమిటీ స్తంభింపజేసింది.. ఈ సమయంలో "మా ముందు సిరీస్ ను రద్దు చేయడం మినహా మరో మార్గం కనిపించడం లేదు..ఈ మ్యాచ్ లను నిర్వహించేందుకు మా వద్ద డబ్బులేదు. ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? లోధా కమిటీ చాలా ఎక్కువ చేస్తోంది. ఆటగాళ్లకు డబ్బులివ్వకుండా మ్యాచ్ లు జరుగుతాయా? డబ్బులు తీసుకోకుండా మూడో టెస్టును ఆడేందుకు ప్లేయర్లు సిద్ధమైతే మాకూ సంతోషమే. అప్పుడే మ్యాచ్ జరుగుతుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్ ముందు పరువు పోతుందని ఆరోపించారు. మరోవైపు బీసీసీఐ వ్యాఖ్యలను లోథా కమిటీ ఖండించింది. బ్యాంకు ఖాతాలను ఎవరూ స్తంభింపజేయలేదని చెబుతున్నారు.