లాక్డౌన్ శాశ్వత పరిష్కారం కాదు! రాహుల్ ఆవేదన
posted on Apr 16, 2020 @ 6:16PM
ప్రస్తుతం దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీని సంఖ్యను భారీగా పెంచాల్సి ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడాలి. కరోనా పరీక్షలు వ్యూహాత్మకంగా జరగట్లేదు. కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచడమే మనముందున్న ఏకైక మార్గం. ర్యాండమ్ పద్ధతిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. దేశంలో రెండు జోనులు ఏర్పాటు చేయాలి.. ఒకటి హాట్స్పాట్, మరొకటి నాన్ హాట్స్పాట్ జోన్. ఆ తర్వాత ఆయా జోనుల్లో పలు చర్యలు తీసుకోవాలి" అని రాహోల్ గాంధీ సూచించారు.
లాక్డౌన్ తో దినసరి కూలీలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రణాళికలు రచించాలి. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయ్యేలా చేయకూడదు" అని రాహుల్ అన్నారు.
లాక్డౌన్ తో వైరస్ ను తాత్కాలికంగా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడానికి ఉపయోగించే తాత్కాలిక పద్ధతి. ఇప్పట్టికైనా ప్రభుత్వం విస్తృతస్థాయిలో టెస్ట్లను నిర్వహించాలని రాహుల్గాంధీ డిమాండ్ చేశారు.