Read more!

పాయింట్ లాగిన పొన్నాల!

 

 

 

మొన్నటి వరకూ టీఆర్ఎస్‌తో చివరి క్షణంలోనైనా పొత్తు కుదురుతుందేమోననే ఆశతో టీఆర్ఎస్ ఎంత తిట్టినా ఆచితూచి మాట్లాడిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గొంతు పెంచారు. టీఆర్ఎస్‌ మీద తనదైన శైలితో సెటైర్లు వదలడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న వాగ్దానాల ఖరీదు కనీసం ఐదు లక్షల కోట్లు వుంటుందని, మొత్తం తెలంగాణ బడ్జెట్టే డెబ్బై వేల కోట్లు అయినప్పుడు, ఐదు లక్షల కోట్ల హామీని కేసీఆర్ ఎలా నెరవేరుస్తాడో ఆయనకే తెలియాలని పొన్నాల పాయింట్ లాగారు. కేసీఆర్ చేస్తున్న హామీలన్నీ అరచేతిలో స్వర్గం చూపించేవేనని అన్నారు. కేసీఆర్ హెలికాప్టర్‌లో ప్రచారం చేస్తున్నారని ప్రస్తావిస్తే, కేసీఆర్ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో డబ్బులు పండిస్తున్నారో లేక రకరకాలుగా డబ్బు వచ్చి పడుతోందోనని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాగా ఆచరణసాధ్యం కాని హామీలు తమ పార్టీ ఇవ్వదని పొన్నాల చెప్పారు.