టీడీపీ నుండి బెదిరింపులు వస్తున్నాయి.. ఏం ఇవ్వడానికైనా రెడీ..
posted on May 13, 2016 @ 12:27PM
వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం టీడీపీపై విమర్శలు చేస్తున్నాడు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గత కొంత కాలంగా టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటికి స్పందించిన అతను తనకు టీడీపీలో చేరాలని బెదిరింపులు వస్తున్నాయని.. కానీ ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని.. వైసీపీని వీడి టీడీపీలోకి చేరేది లేదు అని స్పష్టం చేశారు. టీడీపీ నుండి తనను కొంత మంది మంత్రులు కలిశారని వారు ఏం కావాలన్నా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. కాగా ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి పదిహేనుమందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.