మామయ్య పిలిచారు అందుకే వచ్చా: జూ.ఎన్టీఆర్
posted on Jun 8, 2014 @ 4:15PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం సంతోషాన్ని కలిగిస్తోందని, మామయ్య చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలసి హాజరవుతుున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులు ఉదయం నిమ్మకూరుకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. మావయ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం... అదీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందటం గర్వంగా ఉందన్నారు. కొత్త రాష్ట్రానికి మామయ్య తొలి ముఖ్యమంత్రి కావడం గర్వకారణమన్నారు. తాను కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని తిలకించబోతున్నట్లు చెప్పారు.