చంద్రబాబుకి విధేయుడిని.. పార్టీకి కాదు.. జేసీ
posted on Jan 28, 2016 @ 10:10AM
కొన్ని రోజుల నుండి సైలెంట్ గా ఉన్న తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనని పిలిచి టికెట్ ఇచ్చారని.. చంద్రబాబుకు విజన్ ఉందని.. అలాంటి చంద్రబాబుకు మాత్రమే నేను విధేయుడిని కానీ పార్టీకి కాదని ఆయన అన్నారు. అంతేకాదు గత శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఆయన స్పందిస్తూ రోజా అసెంబ్లీలో ఉండటం దురదృష్టకరమని, ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బాధపడుతున్నానని అన్నారు. ఎంతో హుందాగా, క్రమశిక్షణగా నడుచుకోవాల్సిన సభ్యులు పోడియం వద్దకు వెళ్లి గొడవచేసే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.