వైద్య విద్యార్ధుల బాండ్ పాలసీ సబబేనా?
posted on Nov 8, 2022 @ 3:24PM
వైద్య విద్య ను అభ్యసించే వైద్య విద్యార్ధులపై ముఖ్యంగా గ్రేడ్యుయేట్, పోస్ట్ గ్రేడ్యు యేట్ విద్యార్ధులపై బాండ్ పాలసీ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బాండ్ పాలసీ ప్రకారం అవసరమైన ఆయా రాష్ట్రాల లోని ఆసుపత్రులు ప్రాంతాలాలో కొంత కాలంవరకు వైద్య సేవలు తప్పనిసరి చేస్తూ నిబందనలు రూపొందిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఒకవేళ ఈ నిబంధనను అతిక్రమిస్తే, అయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్య కళాశాలలు నిర్ణయించిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబందనలో పేర్కొన్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ డాక్టర్లకు బాండ్ పాలసీని అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తోంది. బాండ్ పాలసీని వ్యతిరేకిస్తూ దూరంగా వారి పట్ల కఠిన చర్యలు చేపట్టాలని లేదా వారివద్ద పరిహారం కట్టే విధంగా చర్యలు చేపట్టే విధానం జాతీయ మెడికల్ కమీషన్ బాండ్ రూపకల్పన లో ప్రభుత్వానికి విధి విధానా లను సూచించిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మేరకు నిర్దేశించే కాలానికి అండర్ గ్రేడ్యుయెట్, పోస్ట్ గ్రేడ్యుయెట్, సమయం తరువాత పని చేయాల్సి ఉంటుంది.
ఆయా రాష్ట్రాలు బాండ్ పాలసీ ని 2౦19 లోనే సుప్రీం కోర్ట్ నిలుపుదల చేసింది. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఖచ్చితమైన కట్టినమైన నిబందనలు అమలు విధించడా న్ని గుర్తించింది. కేంద్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక యునిఫాం ఒకే విదివిధానాన్ని రూపొందించాలని సూచించింది. డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలాలో తప్పని సరిగా సేవలు చేయాలని అధికారులు వెల్లడించారు. 2౦19 నిబందనల ప్రకారం బాండ్ చట్టంలేదా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 19 56 నిబందనల ప్రకారం రూపొందిన్చాలా అన్నది సందిగ్ధం లో ఉంది. ఆయారాష్ట్రాల పరిదిలో వైద్యసేవలు అందించాల్సి ఉన్నందున ఖాళీ ఉన్నస్థానాలను తక్షణం భర్తీ చేయడం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నియమించాల్సి ఉన్నందున సి హెచ్ సి. డి హెచ్ సి లు, పి హెచ్ సి లు ఆరోగ్యకేంద్రాలాలో నియమించాలని నిర్ణయిం చారు. బాండ్ నిబంధనల ప్రకారం జరిమానా 5 లక్షలు రూపాయలు గోవా, రాజస్థాన్ లలో అమలులో ఉందని. ఉత్తరాఖండ్ లో 1 కోటి రూపాయలు. కేరళలో ఉత్తరాంచల్ లో మహారాష్ట్రాలలో పి జి సూపర్ స్పెషాలిటి2.25 కోట్లు సూచించింది. అయితే, పునఃసమీక్ష తరువాతే బాండ్ అమలు చేయాలని నిర్ణయించాయి.
సుప్రీం మార్గనిరేదేశం ప్రకారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటి అధ్యక్షునిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రధాన సలహాదారు డాక్టర్ బి డి అతాని ని నియమించింది. 2౦19 నాటి బాండ్ పాలసీ విధానాన్ని పూర్తిగా సమీక్షించాలని కోరింది ఈమేరకు అతాని నేతృత్వం లోని బృందం 2౦2౦ మే నాటికి కమిటి నివేదికను సమర్పించింది. నివేదిక పై ఎన్ ఎం సి నేషనల్ మెడికల్ కమీషన్ తమ వ్యాఖ్యను పంపాలని కోరింది. డాక్టర్ బి డి అదాని నేతృత్వం లోని బృందం ఇచ్చిన నివేదిక పై అసలు సంప్రదాయమ విధానాలు తప్పనిసరిగా బాండ్ పాలసీలో నిబందనలు ఒక్కోరాష్ట్రంలో ఒక్కో ఒక్కో విధానం ఉందని పెర్కొన్నారు.
అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్లు తీవ్రంగా తప్పు పట్టారు. బాండ్ పాలసీ కి వ్యతిరేకంగా హర్యానాలో డాక్తర్లసంఘం బ్లాక్ డే పాటించింది. హర్యానాలో పోలీసులు బాండ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపు తున్న డాక్టర్ల పై అమానుషంగా ప్రవర్తించ డాన్ని తీవ్రంగా ఖండించింది. డాక్టర్ల పై బాండ్ చట్టాన్ని బల వంతంగా రుద్దేందుకు హర్యానా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తమ పై దాడి చేయడం అనైతిక మని దీనిని అంగీక రించబోమని డాక్టర్లు హెచ్చరించారు.
హర్యానాలో వివిధ డాక్టర్ల సంఘాలు బ్లాక్ డే ను పాటించాయి. ఎం బి బి ఎస్ అడ్మిషన్ల ప్పుడేబాండ్ ను అమలు చేయాలన్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. ఫార్డా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ విద్యార్ధులకు మద్దతుతేలిపింది. హర్యానా వైద్య విద్యార్ధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఈ అంశంపై ఫెడెరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మంసూక్ మాండ వీయ కు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు.
ప్రభుత్వ వైద్యకళాశాలలో ఇటీవలే డాక్టర్ల ఫీజు పెంపుపై హర్యానాలో ఇటీవలే డాక్టర్లు ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడిందని తీవ్రంగా పరిణమించింది . వైద్య విద్యార్దుల పై వాటర్ కేనన్లు ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు తెలిపారు. ఇది వైద్య విద్యపై మరోదాడి.గా అభివర్ణించారు. అనవసరపు ఫీజు పెంపు బాండ్ పోలసీ అమలు పోలీసుల అమాయక విద్యార్ధుల పై దాడి చేయడాన్ని సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
కోవిడ్ సమయం లో అత్యవసర సమయం లో డాక్టర్లు అందించిన సేవలు అద్భ్తతమని ప్రభుత్వం విస్మరించరాద ని లేఖలో పేర్కొన్నారు. ఫార్డా జాతీయ కార్యదర్శి ఉపాధ్యక్షుడు సర్వేశ్ పాండే హర్యానా పోలీసులతీరును వ్యవహార శైలిని అనాగరిక చాయగా పేర్కొన్నారు. బాండ్ ను హర్యానా ప్రభుత్వం బలవంతంగా అమలు చేయాలని చూస్తోందని ఇది అనైతిక చర్యాగా పేర్కొన్నారు. ఫైమా ముఖ్య సలహాడారు డాక్టర్ మనీష జాం గ్రా రోహ్ తక్ చేరుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. డాక్టర్ జంగ్రా మాట్లాడు తూ 4౦ లక్షల బాండ్ పోలసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మేము వైద్య విద్యార్ధు లకు అండ గా ఉంటామని వారికి మా సంపూర్ణ మద్దత్తు ఉంటుందని పేర్కొన్నారు.
బాండ్ పాలసీని అయారాష్ట్రాలు ఇప్పటికే మార్పులు చేశాయని దేశంలో వైద్య విద్య అంశాలు మరల పునః సమీ క్షించాలని సూచించింది. చాలా ప్రభావ వంతంగా ఉండేవిధంగా రాష్ట్రాలకు నివేదించాలని సూచించారు. నేషనల్ మెడికల్ కమిషన్ కూలంకషంగా పరిశీలించింది. ఇప్పటికే సుప్రీం బాండ్ పాలసీని నిలుపు దల చేసిందని బాండ్ ద్వారా అయితే వైద్య విద్యార్ధులు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారరాదని పేర్కొంది. సహజ న్యాయానికి విరుద్ధంగా ఉందని అధికారులు పేర్కొనడం గమనార్హం.
బాండ్ విధానం పై ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతుందని మొత్తంగా బాండ్ పాలసీని పరీ క్షించి రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించింది. బాండ్ పాలసీపై విధి విధానాలు బాండ్ రూపు రేకలు ఎలా ఉండాలి. బాండ్ అమలుకు ముందే ఆయా సమయానికి పోస్టులు ఉన్నాయా ఇంటర్న్ షిప్ పూర్తి చేయాలని అధికారులు వెల్లడించారు.