పార్టీని వీడను..బ్రతికించుకుంటా:ఎర్రబెల్లి
posted on Mar 3, 2014 @ 6:03PM
తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ పార్టీని వీడుతారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడనని, తెలంగాణలో పార్టీని బ్రతికించుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అధినాయకత్వానికి సూచనలు చేసినట్లు తెలిపారు. అయితే తెలంగాణ టిడిపి కి ప్రత్యేక కమిటీ వేయనందుకు నిరసనగా ఈ రోజు తెలంగాణ టిడిపి పోరం కన్వీనర్ పదవికి రాజీనామా కూడా చేశారు. పార్టీని కూడా వీడేందుకు సిద్దమయ్యారని వార్తలు కూడా వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక కమిటీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ సీనియర్లు మోత్కుపల్లి నరసింహులు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు,ఎల్.రమణ,మండవ వెంకటేశ్వరరావులతో కమిటీ వేయవచ్చని భావిస్తున్నారు. వారంలోగా ప్రత్యేక కమిటీపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.