యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్.. సుప్రీం కోర్టు లైన్ క్లియర్
posted on Oct 21, 2024 @ 3:57PM
గ్రూప్ 1 మోయిన్స్ పరీక్ష యథావిధిగా జరగనుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు లైన్ క్లియర్ చేసింది. పరీక్షను వాయిదా వేయాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా అంగీకరించలేదు.
దీంతో షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఆరంభమైంది. 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 మెయిన్స్ సోమవారం (అక్టోబర్ 21) నుంచి 27వ తేదీ వరకు యథావిధిగా జరుగుతాయి. ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 46 కేంద్రాల వద్దా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.