యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్.. సుప్రీం కోర్టు లైన్ క్లియర్

గ్రూప్ 1 మోయిన్స్ పరీక్ష యథావిధిగా జరగనుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు లైన్ క్లియర్ చేసింది. పరీక్షను వాయిదా వేయాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా అంగీకరించలేదు.

దీంతో షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఆరంభమైంది.   563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 మెయిన్స్ సోమవారం (అక్టోబర్ 21) నుంచి   27వ తేదీ వరకు  యథావిధిగా జరుగుతాయి. ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.  ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో  46   కేంద్రాల వద్దా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.