గవర్నర్ రాజీనామా?
posted on Jun 16, 2015 @ 11:01AM
నోటుకు ఓటు కేసులో వ్యవహారంలో అందరి పరిస్థితి ఏమో కానీ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కి మాత్రం మొట్టికాయలు తప్పట్లేదు. అందరూ ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్లే. ముఖ్యంగా తెదేపా శ్రేణులు గవర్నర్ వ్యవహారంపై గుర్రుమంటున్నారు. అటు ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఫోన్లు ట్యాపింగ్ విషయంలో, కేసు విషయంలో గవర్నర్ ఏం పట్టించుకోవడం లేదని.. వివక్ష చూపుతున్నారని.. తమకు భద్రత లేకుండా పోయిందని తిట్టి పోయడమే కాకుండా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు సెక్షన్ 8 అమలు పై గవర్నర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని.. దాని ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేస్తున్నా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామాకు సిద్ధమయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజీనామా చేస్తానన్న గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం బుజ్జగిస్తున్నట్టు, మరోవైపు గవర్నర్ మార్పు కూడా ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.