సొంత అన్నను చంపిన.. ఆస్తి వివాదం..
posted on Feb 26, 2021 9:05AM
మంచితనం ఓడింది. అత్యాశే గెలిచింది. ఒకే రక్తం పంచుకుని పుట్టారు. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య వివాదం నడిచింది. తమ్ముడి మూర్ఖత్వం సొంత అన్న చావుకు బలికోరింది. వారసత్వంగా రావాల్సిన ఆస్తి ని తమ్ముడు ఒక్కడే అనుభవిస్తున్నాడు. పలుమార్లు తనకు వారసత్వంగా రావాలిన భూమి తనకు ఇవ్వమని అన్న తమ్ముడ్ని అడిగాడు. తమ్ముడి వినలేదు. చివరికి ఆ ఆస్తి వివాదమే అన్న చావుకు కారణమైంది.
మృతుడు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట వాస్తవ్యుడు కృష్ణారెడ్డి. బతుకుదెరువు కోసం అతను ఏపీలోని గుంటూరు జిల్లా చేవెళ్లపురంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి తమ్ముడు కొండల్రెడ్డి ఊర్లోనే ఉంటున్నాడు. తండ్రి నర్సింహారెడ్డి తాను కొన్న 10 ఎకరాల్లో రెండెకరాలను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. నర్సింహారెడ్డి మృతిచెందిన తర్వాత కొండల్రెడ్డి ఒక్కడే ఆ 8 ఎకరాల భూమిని తన పేరు మీద చేసుకోవడంతో వివాదం మొదలైంది. తనకు రావాల్సిన వాటా 4 ఎకరాలను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని కొండల్ రెడ్డిని అన్న కృష్ణారెడ్డి కోరాడు. గ్రామపెద్దల ముందు అన్నకు రావాల్సిన వాటా ఇస్తానని ఒప్పుకున్న కొండల్ రెడ్డి ఊరి పెద్దల మాటలను లెక్కచేయకుండా, అన్నదమ్ముల బంధాన్ని మరిచి రాక్షసుడిలా ప్రవర్థించాడు. తన వాటా ఇవ్వాలని అన్న పదేపదే కోరినా తమ్ముడు మొహం చాటేస్తుండటంతో కృష్ణారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. సోదరుడి నుంచి ఇక భూమి రాదేమోనన్న ఆందోళనతో చివరికి ఆన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణారెడ్డి చావుకు తమ్ముడు కొండల్రెడ్డే కారణమని ఆరోపిస్తూ బంధువులు కొండల్రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేశారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో కృష్ణారెడ్డి ఇద్దరు కొడుకులు అనాథలుగా మారారని, ఇప్పటికైనా ఆస్తిని పిల్లల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.