విమర్శించడం ఆపి సలహాలు ఇస్తే మంచిది.. డొక్కా కౌంటర్
posted on Nov 5, 2015 @ 2:58PM
ఏపీలో టీడీపీపై, చంద్రబాబునాయుడిపై పలువురు బీజేపీ నేతలు పలు రకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ వారికి ధీటుగా సమాధానం చెప్పారు. హరిరామ జోగయ్య తన 60 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అనే పుస్తకంలో చంద్రబాబు గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై వివారణ ఇవ్వాలని మాజీ మంత్రి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అంతేకాదు టీడీపీకి ఆదరణ తగ్గుతుందని కావూరి వ్యాఖ్యనించాడు. దీనిపై డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ-బీజేపీ మిత్రపక్షమన్న సంగతి బీజేపీ నేతలు మరిచిపోయినట్టున్నారు.. మిత్రధర్మాన్ని మరచి వారు విరుద్దంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబును విమర్శించడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మంచిదని సూచించారు. రాజకీయంగా ఉనికి లేనప్పుడే కాపుల గురించి మాట్లాడే నేతల పట్ల కాపులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి రాజకీయ నేతలా కాకుండా కాగ్ ప్రతినిధిగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.