అయితే 24 గంటల్లో అందజేయండి.. గ్రీన్ ట్రిబ్యునల్
posted on Nov 5, 2015 @ 3:44PM
ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కేంద్ర పర్యావరణ సంస్థ అనుమతిచ్చిందని.. ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ రాజధాని విషయంలో షాకిచ్చింది. శ్రీమన్నారాయణ అనే వ్యక్తి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పర్యావరణ చట్టాలను, నిబంధనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. అయితే దీనికి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పందించి ఏపీ రాజధాని నిర్మణానికి కేంద్ర పర్యావరణ శాఖ నుండి అనుమతి పొందామని.. అక్టోబర్ 9 నాటికే అనుమతులు వచ్చాయని చెప్పారు. దీనికి గ్రీన్ ట్రిబ్యునల్.. అయితే దానికి సంబంధించిన పత్రాలను 24 గంటల్లో అందజేయాలని సూచించింది.