ధర్మాన ఎఫెక్ట్...వైకాపాకు మాజీల షాక్
posted on Feb 24, 2014 @ 11:04AM
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేరికతో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళ౦ జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. ధర్మాన చేరికకు నిరసనగా ఇద్దరు మాజీ సీనియర్ నేతలు కణతీ విశ్వనాథం, హనుమంతు అయ్యప్పదొరలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం ఆత్మగౌరవ సభ నిర్వహించి వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మాన మొహం కూడా చూడనని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి..ఆయనను తన పక్కన ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. తాము ఏపార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తామని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి రాజీనామా జిల్లాలో వైకాపా గట్టి దెబ్బగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. వీరు ఏ పార్టిలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి పార్టీకి చెందిన నేతలు వీరితో పోటాపోటీ భేటీలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు బట్టి వీరు టిడిపికి ప్రాధాన్యం ఇచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి.