తిరుమలలో పెరిగిన రద్దీ
posted on Apr 14, 2024 8:32AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (ఏప్రిల్ 13) శ్రీవారిని మొత్తం 82 వేల 139 మంది దర్శించుకున్నారు.
వారిలో 39 వేల849 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3కోట్ల 97లక్షల రూపాయలు వచ్చింది.