Read more!

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మార్చి 23) శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15గంగలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 69వేల 236 మంది దర్శించుకున్నారు.

వారిలో 25వేల 446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 38లక్షల రూపాయలు వచ్చింది.