దాసరిగారూ... కిర్లంపూడికి వెళ్లొద్దు!
posted on Feb 8, 2016 @ 10:01AM
ముద్రగడ దీక్షకు మద్దతుగా కిర్లంపూడికి ప్రముఖుల వలస మొదలైది. వీరి రాక వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. తమ ఆందోళనను పట్టించుకోకుండా ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తే తునిలో జరిగిన సంఘటనలే పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముద్రగడను కలుసుకునేందుకు బయల్దేరిని దాసరి ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. ఆయనను కలిసిన పోలీసులు కిర్లంపూడికి వెళ్లవద్దని ఆయనను కోరినట్లు సమాచారం. మరోపక్క దీక్ష మొదలై 70 గంటలు దాటిపోవడంతో ముద్రగడ దంపతుల ఆరోగ్యం గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ముద్రగడ దంపతులు వైద్య పరీక్షలను కూడా నిరాకరించడంతో... ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల తూర్పుగోదావరి జిల్లా అంతటా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.